TG | బోనాల ఉత్స‌వాల‌కు రెడీ – ప‌ట్టువ‌స్త్రాల‌ను స‌మ‌ర్పించే ప్ర‌ముఖుల వీరే

హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : ఆషాఢ మాసంలో (ashada masam)బోనాల పండుగకు హైద‌రాబాద్ లో ఆల‌యాలు ముస్తాభ‌వుతున్నాయి. ఈ మేరకు త్రిసిటీ పరిధిలోని వివిధ ఆలయాలకు పట్టు వస్త్రాలు సమర్పించే మంత్రులు, ముఖ్య నేతల వివరాలను దేవాదాయ, ధర్మాదాయ శాఖ వెల్లడించింది. వచ్చే నెల 13న సికింద్రాబాద్ ఉజ్జయిన ( Ujjain Mahakali) మహంకాళి ఆల‌యంలో బోనాలు పండ‌గ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) వెళ్ల‌నున్నారు. ఈ సంద‌ర్భంగా అమ్మవారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పిస్తారు.

  • ఆగస్టు 20న లాల్ దర్వాజ‌లోని సింహవాహిని మహంకాళి ఆలయానికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వెళ్లి పట్టు వస్త్రాలు అందజేస్తారు.
  • నాచారంలోని మహంకాళి సహిత మహాకాళేశ్వర స్వామి దేవస్థానానికి రాష్ట్ర నీటిపారుద‌ల శాఖ‌ మంత్రి ఎన్‌.ఉత్తమ్ కుమార్ రెడ్డి ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పిస్తారు.
  • కార్వన్‌లోని దర్బార్ మైసమ్మ ఆలయానికి వైద్య ఆరోగ్య‌శాఖ‌ మంత్రి దామోదర రాజనర్సింహ ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పిస్తారు.
  • చార్మినార్‌లోని భాగ్యలక్ష్మి ఆలయంలో అమ్మ‌వారికి రాష్ట్ర ఆర్ అండ్‌బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంద‌జేస్తారు.
  • హరిబౌలిలోని అక్కన్న మాదన్న ఆలయంలో ఐటీ శాఖ మంత్రి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, చిలకలగూడలోని కట్ట మైసమ్మ ఆలయంలో రెవెన్యూ, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఆగస్టు 1న బల్కంపేటలోని ఎల్లమ్మ పోచమ్మ దేవస్థానంలో అమ్మ‌వార్ల‌కు రాష్ట్ర దేవ‌దాయ శాఖ మంతి కొండా సురేఖ, అలాగే రాష్ట్ర ర‌వాణా శాఖ, హైద‌రాబాద్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ప‌ట్టువ‌స్త్రాలు అంద‌జేయ‌నున్నారు.
  • గోల్కొండ కోటలోని జగదాంబ మహంకాళి ఆలయానికి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ వెళ్లి ప‌ట్టువ‌స్త్రాలు అంద‌జేయ‌నున్నారు.
  • వచ్చే నెల 20న సబ్జిమండిలోని నల్లపోచమ్మ ఆల‌యంలో అమ్మ‌వారికి రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ‌ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎన్టీఆర్ నగర్‌లోని ఖిలా మైసమ్మ ఆల‌యంలో మంత్రి సీతక్క, మిరాలం మండిలోని మహంకాళి ఆల‌యంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, బేలలోని ముత్యాలమ్మ ఆల‌యంలో మంత్రి గడ్డం వివేక్ వెంకట్ స్వామి, గౌలిపూరలోని మహంకాళి ఆల‌యంలో మంత్రి వాకిటి శ్రీహరి ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పిస్తారు.
  • సుల్తాన్ షాహీలోని జగదాంబ ఆలయానికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఉప్పుగూడలోని మహంకాళి ఆలయానికి గుత్తా సుఖేందర్ రెడ్డి శాసన మండలి చైర్మన్, బోయిగూడలోని బంగారు మైసమ్మ ఆలయానికి రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, హరిబౌలిలోని బంగారు మైసమ్మ ఆలయానికి గద్వాల విజయలక్ష్మి, జీహెచ్ఎంసీ మేయర్, అంబర్‌పేట్‌లోని మహంకాళి ఆలయానికి బండా ప్రకాష్, శాసన మండలి డిప్యూటీ చైర్మన్, అలియాబాద్ దర్బార్ మైసమ్మ ఆలయానికి డిప్యూటీ స్పీకర్ రామచందర్ నాయక్ ప్రభుత్వం తరఫున హాజరై అయా ఆలయాల అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.

Leave a Reply