వెలగపూడి : సచివాలయం (Secretariat) లో ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఏపీ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం (Cabinet meeting) ముగిసింది. 42 అజెండా అంశాలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అజెండా అంశాల అనంతరం రాజకీయ అంశాలపై చర్చ జరిగింది. పోలవరం, బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుపై అనుమానాలు నివృత్తి చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) సూచించారు.
తెలంగాణకు ఉన్న అన్ని అనుమానాలను నివృత్తి చేయాలన్నారు. పోలవరం (Polavaram), బనకచర్ల (Banakacharla) అనుసంధాన ప్రాజెక్టు ద్వారా వరద జలాలే వాడుకుంటున్నామన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణ (Telangana) కు ఎలాంటి నష్టం లేదన్నారు. తెలంగాణలో అనుమతులు లేకుండా ఎన్నో ప్రాజెక్టులు చేపట్టినా అభ్యంతరం చెప్ప లేదన్నారు. పోలవరం, బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుపై నేతలు అంతా మాట్లాడాలన్నారు. కేవలం రాజకీయం కోసమే తెలంగాణలో కొందరు అభ్యంతరాలు చెబుతున్నారన్నారు. ప్రజలకు వాస్తవాలు వివరించాల్సిన బాధ్యత మంత్రులు, నాయకులపై ఉందన్నారు.