- రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా ఏర్పాట్లు
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని రాష్ట్రం నలుమూలలా ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్లో వివిధ వేడుకల్లో పాల్గొననున్నారు.
అధేవిధంగా, జిల్లాల్లో జరిగే వేడుకల కోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. మొత్తం 32 జిల్లాలకూ మంత్రులు, సలహాదారులు, వివిధ పదవుల్లో ఉన్న నాయకులను ప్రతినిధులుగా నియమించింది. వీరు ఆయా జిల్లాల్లో జరిగే అధికారిక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
వేడుకల సందర్భంగా ప్రతి జిల్లాలో ముందుగా తెలంగాణ కోసం ప్రాణత్యాగాలు చేసిన అమరులకు నివాళులు అర్పించనున్నారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించడం జరుగుతుంది. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసేలా ప్రభుత్వం సూచనలు జారీ చేసింది.
ఇక జిల్లాల వారీగా ఎవరు ఏ ప్రాంతాల్లో ప్రతినిధులుగా హాజరవుతారన్న వివరాలను ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వుల రూపంలో విడుదల చేసింది.

