వాషింగ్టన్ – అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధానికి తెరపడింది.. ఇరు దేశాల దిగుమతుల పై వేసిన అదనపు సుంకాలను రద్దు చేశాయి.. గతంలో ఉన్నట్లుగా 30 శాతం సుంకాలు అమలునకు ఇరు దేశాలు అంగీకరించాయి.. ఈ ఒప్పందాన్ని 30 రోజుల పాటు అమలు చేయాలని నిర్ణయించినట్లు అమెరికా ఫైనాన్స్ కార్యదర్శి స్కాట్ బెసెంట్ వెల్లడించారు.. ఇరు దేశాల ప్రతినిధులు గత రెండు రోజులుగా జెనీవా వేదికగా చైనా ప్రతినిధులతో అమెరికా చర్చలు జరిపారు.. ట్రేడ్ వార్ ని ముగించేందుకు ఇరు దేశాల మధ్య చర్చలు జరిగాయని స్కాట్ బెసెంట్ తెలిపారు. ఇరు దేశాల మధ్య కొంత పురోగతి సాధించామని, అంటు చర్చల వివరాలను వెల్లడించారు.. గతంలో విధించిన అన్ని అదనపు సుంకాలు రద్దు చేసేందుకు ఇరు దేశాలు అంగీకరించాయిన ఆయన పేర్కొన్నారు.. ఇంతకు ముందు ఉన్న పన్నులే కొనసాగనున్నాయని తెలిపారు.
Talks Success | ఆమెరికా – చైనాల మధ్య ట్రేడ్ వార్ కు తెర
