బాసర, ఏప్రిల్ 9 (ఆంధ్రప్రభ) : గోదావరి నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడేందుకు వచ్చిన మహిళను కాపాడి కుటుంబ సభ్యులకు అప్పగించాడు కానిస్టేబుల్ మోహన్ సింగ్. ఇవాళ గోదావరి నది వద్ద విధుల్లో ఉన్న మోహన్ సింగ్ అనుమానాస్పదంగా ఉన్న మహిళను వివరాలు అడుగగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడేందుకు వచ్చినట్లు తెలుపగా.. కానిస్టేబుల్ ఆమెను మంచి మాటలతో సముదాయించి ఎస్ఐ గణేష్ కు సమాచారమిచ్చారు. ఎస్సై గణేష్ వివాహిత మహిళ వద్ద పూర్తి వివరాలు సేకరించారు. భైంసా పట్టణం కుంటగల్లికి చెందిన కుటుంబ సభ్యులకు సమాచారం అందించి పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
Basara | ఆత్మహత్యకు యత్నం.. మహిళను కాపాడిన కానిస్టేబుల్
