సూర్యాపేట : జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కాలేజీ బిల్డింగ్ పై నుంచి ఓ విద్యార్థిని దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన కాసేపటి క్రితమే సూర్యాపేట జిల్లాలో జరిగింది. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం గేట్ ఇంజనీరింగ్ కాలేజీలో ఈ దారుణమైన సంఘటన చోటుచేసుకుంది.
ఉగాది పండుగకు వెళ్లి నిన్న రాత్రి తల్లితో కలిసి కాలేజీకి వచ్చింది కృష్ణవేణి అనే స్టూడెంట్. ఇక ఉదయం కాలేజీ భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది కృష్ణవేణి. మంచిర్యాలకు చెందిన కృష్ణవేణి ప్రస్తుతం బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతోంది. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.