హైదరాబాద్, (ఆంధ్రప్రభ ) : బయోఫిలిక్, పర్యావరణ అనుకూల రియల్ ఎస్టేట్లో మార్గదర్శక సంస్థ అయిన స్టోన్క్రాఫ్ట్ గ్రూప్, ఉడ్స్ శంషాబాద్ వద్ద తమ విప్లవాత్మకమైన ఏక్యూఐ (ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్) మానిటరింగ్ స్టేషన్ను ప్రారంభించింది.
ఈ కార్యక్రమం పర్యావరణ పరిరక్షణ పట్ల కంపెనీ స్థిరమైన నిబద్ధతను, పర్యావరణ స్పృహతో కూడిన ప్రాంగణాలను సృష్టించాలనే దాని లక్ష్యాన్ని నొక్కి చెబుతుంది.
ఈ కార్యక్రమంలో స్లోవేనియా రిపబ్లిక్ రాయబారి మాటేజా వోడెబ్ ఘోష్, స్లోవేనియా రిపబ్లిక్ ఆర్థిక సలహాదారు టీ పిరిహ్, జీహెచ్ఎంసి అర్బన్ బయోడైవర్సిటీ వింగ్ అదనపు కమిషనర్ వివిఎల్ సుభద్రా దేవి (ఐఎఫ్ఎస్), భారత ప్రభుత్వ మాజీ అదనపు కార్యదర్శి అశోక్ పవాడియా సహా సుప్రసిద్ధ నిపుణులు, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈసందర్భంగా స్లోవేనియా రిపబ్లిక్ రాయబారి మతేజా వోడెబ్ ఘోష్ పర్యావరణ అనుకూల కార్యక్రమాల ప్రపంచ ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ…. ప్రభుత్వాలు, ఎన్జీఓలు, కార్పొరేట్లు లేదా వ్యాపారాలు, ఎవరైనా సరే, గాలి నాణ్యతను మెరుగు పరచడం, పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహించడం కోసం సమిష్టిగా పనిచేయడం చాలా అవసరమన్నారు. కీర్తి చిలుకూరి నేతృత్వంలోని స్టోన్క్రాఫ్ట్ గ్రూప్ వంటి రియల్ ఎస్టేట్ డెవలపర్లు టౌన్ ప్లానర్లు, ఆర్కిటెక్ట్లపై కీలక బాధ్యత ఉందన్నారు.
స్టోన్క్రాఫ్ట్ గ్రూప్ వ్యవస్థాపకులు అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కీర్తి చిలుకూరి, పర్యావరణ సంరక్షణ కోసం సమిష్టి ప్రయత్నాల ప్రాముఖ్యతను వెల్లడిస్తూ… స్టోన్క్రాఫ్ట్ వద్ద, రియల్ ఎస్టేట్ అభివృద్ధి అనేది కేవలం భౌతిక ప్రాంగణాలను సృష్టించడం కంటే ఎక్కువ అన్నారు. ఇది పర్యావరణ అనుకూల సమాజాన్ని నిర్మించడం గురించి అని తాము నమ్ముతున్నామన్నారు.