భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దర్శనార్థం…
నంద్యాల బ్యూరో, ఏప్రిల్ 2 (ఆంధ్రప్రభ) : నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలోని భ్రమరాంబక మల్లికార్జున స్వామి అమ్మవారిలను తెలంగాణ రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దంపతులు బుధవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
స్వామి అమ్మవార్ల దర్శనార్ధమై ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న మంత్రి దంపతులకు కార్యనిర్వహణాధికారి యం.శ్రీనివాసరావు అర్చక వేదపండితులు ఆలయ సంప్రదాయంలో భాగంగా స్వాగతం పలికారు. అనంతరం మల్లికార్జునస్వామి వారికి విశేష రుద్రాభిషేకం, శ్రీ భ్రమరాంబదేవికి విశేష కుంకుమార్చనతో పాటు విశేష పూజలు నిర్వహించారు. పూజల అనంతరం ఆలయ సంప్రదాయంలో భాగంగా అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ఆశీర్వచన మండపంలో మంత్రి దంపతులకు అర్చక వేదపండితులు వేదాశీర్వచనాలు వల్లించగా, కార్యనిర్వహణాధికారి స్వామివార్ల శేషవస్త్రాలను, స్వామివార్ల జ్ఞాపిక, ప్రసాదములనిచ్చి సత్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.