విశాఖ – డీసి తో జరుగుతున్న మ్యాచ్ లో సన్ రైజర్స్ వెంట వెంటనే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అభిషేక్ శర్మ తొలి ఓవర్ లోనే రన్ ఔట్ అయ్యాడు. అనంతరం ఇషాన్ కిషన్ సైతం మూడో ఓవర్లో పెవిలియన్ కు చేరాడు. ఈ వికెట్ స్టార్క్ కి దక్కింది. ఆ వెంటనే నితీష్ రెడ్డి ను స్టార్క్ ఔట్ చేసాడు. ప్రస్తుతం మూడు ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 30 పరుగులు చేసింది సన్ రైజర్స్.
SRH vs DC – సన్ కి కష్టాలు … మూడు వికెట్లు డౌన్
