ఆంధ్రప్రభ, ఇంద్రవెల్లి : ఇటీవల మండలంలోని ధర్మసాగర్ గ్రామంలో తుఫాన్ వర్షానికి పలువురి గృహాలపై కప్పు, పశువులు, తినుబండారాలు నాని ముద్దాయి సర్వం కోల్పోయిన గిరిజనేత్ర గ్రామానికి చెందిన సాబ్లే జైత్రం వికలాంగుడుగా ఉండి సర్వం కోల్పోయాడు. ఆయన దినచర్య ఆటోతో రోజువారి కూలీ సంపాదన కోల్పోయినందులకు ఫైనాన్స్ కంపెనీ వారు ఆయన ఆటోను తీసుకువెళ్లడంతో వారిని సంప్రదించి ఆ ఆటోకు ఉన్న ఫైనాన్స్ డబ్బులను వెడమ ఫౌండేషన్ ఎస్కే గ్రూప్ చైర్మన్ జే కృష్ణ తన వంతు డబ్బులను పూర్తిగా కట్టి ఆ ఫైనాన్స్ ఆటోను సాబ్లె జైత్రంకు అందించారు.
జీవితంలో అవసరం పడితే అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. ఈసందర్భంగా జే కృష్ణ మాట్లాడుతూ… స్థానిక ఎమ్మెల్యే వెడమ బొజ్జుతో సంప్రదించి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి తన వంతు ప్రయత్నిస్తానన్నారు. తెలంగాణాలో వర్షాలు గత ఏడాది కన్నా ముందుగా వస్తున్నందుకు, ఇందులో గాలితో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని, ముందు జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాజీ ఉపసర్పంచ్ శ్యామ్ రావు, బస్సి సర్దార్, డాకురే శత్రుఘన్, జాదో రమేష్, మేడే వార్ అదినాథ్, తదితరులు పాల్గొన్నారు.