Siddipet | మానవత్వం చాటుకున్న హరీష్ రావు

సంగారెడ్డి, పెద్దాపూర్ సమీపంలో ముంబై నేషనల్ హైవేపై లారీ బోల్తాపడడంతో రెండు కార్లు ధ్వంసం అయ్యాయి. ఇదే సమయంలో జహీరాబాద్ పర్యటనకు వెళ్తున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఆ ప్రమాదాన్ని చూసి చలించిపోయారు.

వెంటనే కారు దిగి ప్రమాద ఘటన వద్దకు చేరుకొని, స్థానికులు, వెంట ఉన్న సిబ్బంది, నాయకుల సహాయంతో బాధితులను కారు నుండి వెలికి తీశారు.స్వయంగా తన వాహనంలో క్షతగాత్రులను ఎక్కించి, చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆస్పత్రికి పంపించారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ లతో మాట్లాడి ప్రమాద పరిస్థితులను వివరించారు. అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *