Shot down | పాక్ కు చెందిన ఒక ఎఫ్ 16, రెండు జెఎఫ్ 17 యుద్ద విమానాలు కూల్చివేత

న్యూ ఢిల్లీ – జమ్మూ కశ్మీర్‌లోని శ్రీనగర్ సమీపంలోని గగనతలంలోకి పాకిస్తాన్‌కు చెందిన రెండు యుద్ధ విమానాలను నేటి ఉద‌యం భారత్ కూల్చివేసింది. నిన్నటి వరకు డిఫెన్స్‌ సిస్టమ్‌ ఎస్‌400 గురించి మాట్లాడుకున్నాం.. కానీ, ఇప్పుడు ఈ రెండు జెట్స్‌ను కూల్చింది ఆకాశ్‌ అనే మరో డిఫెన్స్‌ సిస్టమ్‌. పాకిస్తాన్ రాత్రిపూట భారత భూభాగంలోకి డ్రోన్లతో కాల్పులు జరపడంతో జమ్మూ కశ్మీర్‌లో హై అలర్ట్ విధించిన నేపథ్యంలో భారత వైమానిక రక్షణ వ్యవస్థలు వాటిలో ఎక్కువ భాగాన్ని గాల్లోనే అడ్డుకున్నాయి. జమ్మూ కశ్మీర్‌లోని నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాకిస్తాన్ పదే పదే షెల్లింగ్, ఫిరంగి కాల్పులకు పాల్పడుతోంది. దీనికి భారత దళాలు అంతే తీవ్రతతో ప్రతిస్పందిస్తున్నాయి.

కాగా, నేటి ఉద‌యం భార‌త్ స‌రిహ‌ద్దు దాటి శ్రీన‌గ‌ర్ గ‌గ‌న‌త‌లంలోకి ప్ర‌వేశించిన ఒక ఎఫ్ 16, రెండు జెఎఫ్ 17 యుద్ద‌ విమానాల‌ను ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ వ్య‌వస్థ‌ పేల్చివేసింది.. అందులోని పైలెట్స్ దూకేయ‌డంతో జ‌మ్ము భూభాగంలో ప‌డిపోయారు.. ఆ ఫైలెట్స్ కోసం ఆర్మీ బ‌ల‌గాలు గాలిస్తున్నాయి. ఇక మూడు యుద్ద విమానాలు మిస్ అయిన‌ట్లు పాకిస్థాన్ దృవీక‌రించింది.

Leave a Reply