- నవరాత్రి ఉత్సవాలకు విస్తృత ఏర్పాట్లు
- నవ రూపాలలో సరస్వతమ్మ దర్శనం
- మూల నక్షత్రానికి ప్రత్యేక ఏర్పాట్లు
- నవర్ణావ అర్చన పూజలు
- ఆలయ ఈఓ అంజనదేవి
(బాసర, ఆంధ్రప్రభ) : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం చల్లపల్లిలో కొలువైన బాసర (Basara) శ్రీ జ్ఞాన సరస్వతి దేవి ఆలయంలో శారదియా నవరాత్రి ఉత్సవాలకు విస్తృత ఏర్పాటు చేస్తున్నట్లు ఆలయ ఈవో అంజనాదేవి (Anjana Devi) తెలిపారు. శనివారం ఆలయ ఈవో అంజనాదేవి ఆలయ స్థానాచార్యులు ప్రవీణ్ పాటక్, ప్రధాన అర్చకులు సంజీవ్ పూజారి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈనెల 22 సోమవారం నుండి రెండు అక్టోబర్ వరకు ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ తొమ్మిది రోజులపాటు అమ్మవారు తొమ్మిది రూపాలలో భక్తులకు సరస్వతమ్మ దర్శనం ఇవ్వానున్నట్లు ఆలయ స్థానాచార్యులు ప్రధానో అర్చకులు తెలిపారు. ఈ తొమ్మిది రోజులపాటు అమ్మవారి చెంత నా వార్నవా అర్చన శ్రీ చక్ర అర్చన పూజ నిర్వహించినట్లు పేర్కొన్నారు.
ఈనెల 29న అమ్మవారి జన్మ నక్షత్రం మూలా నక్షత్రాన్ని పురస్కరించుకొని భక్తులు (devotees) అధిక సంఖ్యలో తరాలి రానున్న దృష్ట్యా సాధారణ ప్రత్యేక అక్షరాభ్యాస పూజల క్యూ లైన్, సర్వదర్శన ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మూల నక్షత్రం సందర్భంగా భక్తులకు చిన్నారులకు ఉచితంగా పాలు బిస్కెట్లు అరటిపండు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. దేవి నవరాత్రి ఉత్సవాల (Devi Navratri Festival) ను పురస్కరించుకుని ఆలయంతో పాటు ఉపాలయాలను విద్యుత్వికులతో అందంగా అలంకరించారు. భక్తులకు ప్రత్యేకంగా క్యూలైన్లో త్రాగునీరు అందించనున్నట్లు పేర్కొన్నారు.
ఆలయ ప్రాంగణంలో వైద్య శిబిరం, బయో టాయిలెట్లు అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొన్నారు. నవరాత్రులు భక్తుల కోసం సాంస్కృతి కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గోదావరి నది (Godavari River) తీరం వద్ద పుణ్య స్నానాలకు భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రత్తగా అందుబాటులో గజ ఇత గాళ్ళు అందుబాటులో ఉంచడం జరిగిందని తెలిపారు. పోలీసులు స్వచ్ఛంద సేవ సంస్థల ఆధ్వర్యంలో భక్తులకు సేవలు అందించనున్నారని తెలిపారు. సమావేశంలో ఆలయ ఏ ఈ ఓ సుదర్శన్ గౌడ్, సూపరడెంట్ శివరాజ్ సిబ్బంది పాల్గొన్నారు.
