సికింద్రాబాద్లోని బోయిన్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తులు అదృశ్యమయ్యారు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. న్యూ బోయిన్పల్లి ఏడుగుళ్ల సమీపంలో నివాసం ఉండే మహేశ్, ఉమా దంపతులతో పాటు వారి ముగ్గురు పిల్లలతోపాటు మరో కుటుంబ సభ్యురాలు కూడా సంధ్యా కూడా కనిపించకుండా పోయారు. స్థానిక నీటి సరఫరా కేంద్రంలో ఆపరేటర్గా మహేష్ పనిచేస్తున్నాడు.

కాగా,గురువారం మహేష్ ఇంటికి సంధ్యా వెళ్లింది. సంధ్యాతో పాటు అదే రోజు బయటకు వెళ్లి మహేష్, భార్య పిల్లలు తిరిగిరాలేదు. ఇంటి యజమాని సమాచారంతో పోలీసులకు మహేష్ బావ భిక్షపతి ఫిర్యాదు చేశాడు. భిక్షపతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారు అదృశ్యమైనట్లు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆరుగురు ఆటో బుక్ చేసుకుని బోయిన్పల్లి నుంచి ఎంజీబీఎస్ స్టేషన్కు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. అక్కడి నుంచి ఎటు వెళ్లారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా ఆరుగురి ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులను పోలీసులు విచారణ చేస్తున్నారు.
. మిస్సింగ్ గురైన బాధిత కుటుంబ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ, “న్యూ బోయిన్పల్లి నుండి మా అన్నయ్య ఫ్యామిలీ మిస్సింగ్ అయ్యారు. గురువారం సాయంత్రం నుండి అందుబాటులో లేరు. మేము సిటీ లో చాలా చోట వెతికాం కానీ ఎక్కడ ఆచూకీ దొరకలేదు. మాకు తెలిసిన వరకు ఆర్థిక ఇబ్బందులు కుటుంబ కలహాలు ఏమీ లేవు. ఆరుగురు ఆటో బుక్ చేసుకొని బోయిన్పల్లి నుంచి ఎంజీబీఎస్ స్టేషన్కు వెళ్లినట్లు పోలీసులు సీసీ ఫుటేజ్ ద్వారా కనుకొన్నారు. ఎంజీబీఎస్ లో విజయవాడకు చెందిన బస్సు ఎక్కినట్లు సీసీ ఫుటేజ్ లో పరిశీలించారు పోలీసులు. మా అన్నయ్య ఫ్యామిలీ మొబైల్ ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేశారు. ఆటో డ్రైవర్ కూడా పోలీస్ విచారించారు” అని తెలిపారు.