కరీంనగర్లో దుర్ఘటన.. రూ.50 లక్షల నష్టం

కరీంనగర్లో దుర్ఘటన.. రూ.50 లక్షల నష్టం
కరీంనగర్ బ్యూరో, ఆంధ్రప్రభ : కరీంనగర్ టవర్ సర్కిల్(Karimnagar Tower Circle) వద్ద ఉన్న వస్త్ర దుకాణ సముదాయంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. వస్ర్త దుకాణంతోపాటు కెమెరా విడిభాగాల దుకాణం దగ్ధమయ్యాయి. సుమారు రూ.50 లక్షల వరకూ ఆస్తి నష్టం ఏర్పడినట్లు తెలుస్తోంది.
ఈ అగ్ని చెలరేగడం అనేది ఎలా జరిగిందనే కోణంలో అగ్నిమాపక అధికారులు(Fire Officers) ఆరా తీస్తున్నారు. దీనిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని తదుపరి విచారణకు కరీంనగర్ టూ టౌన్ పోలీసులను ఆశ్రయించినట్లు చెప్పారు.


