హైదరాబాద్ : గుల్జార్ హౌస్ లో అగ్నిప్రమాదంలో మరణించిన మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ.5లక్షల చొప్పున పరిహారం ఇస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున అండగా నిలుస్తామని చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్లు తెలియజేశారు. కాగా ఈ ప్రమాదంలో 17 మంది మరణించారు.
TG | మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
