ఎగువ నుంచి వస్తున్న వరదనీటితో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్ (PJP) జలకళ సంతరించుకుంది. ప్రాజెక్టులో నీటి మట్టం ఫుల్ ట్యాంక్ లెవల్ కు చేరుకుంటోంది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో జూరాలకు వరద ప్రవాహం పెరిగింది. ప్రాజెక్ట్ పూర్తి సామర్థ్యం 318.516 మీటర్లు (1,045 అడుగులు) కాగా.. ప్రస్తుతం నీటి మట్టం 317.460 మీటర్లు (అంటే 1,041.535 అడుగులు)గా ఉంది. ఈ పరిస్థితిలో జలాశయ భద్రతపై అధికారులు కట్టుదిట్టమైన నిఘా పెట్టారు.
వరద ప్రవాహ వివరాలు:
- ప్రవాహం (ఇన్ఫ్లో): 46,000 క్యూసెక్కులు
- స్పిల్వే గేట్లు (7) ద్వారా విడుదల: 27,419 క్యూసెక్కులు
- పవర్ హౌస్ ద్వారా విడుదల: 33,931 క్యూసెక్కులు
- ఆవిరి రూపంలో నష్టమయ్యే నీరు: 45 క్యూసెక్కులు
నీటి వినియోగ వివరాలు:
- భీమా లిఫ్ట్ – I: 650 క్యూసెక్కులు
- కోయిలసాగర్ లిఫ్ట్: 315 క్యూసెక్కులు
- ఎడమ ప్రధాన కాలువ (LMC): 920 క్యూసెక్కులు
- కుడి ప్రధాన కాలువ (RMC): 306 క్యూసెక్కులు
- ఆర్డీఎస్ లింక్ కాలువ: 150 క్యూసెక్కులు
- పారలల్ కాలువ: 850 క్యూసెక్కులు
- భీమా లిఫ్ట్ – II: 750 క్యూసెక్కులు
- మొత్తం నీటి విడుదల: 64,436 క్యూసెక్కులు
ప్రాజెక్ట్కు వరద నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో, అధికారులు నియంత్రితంగా నీటిని విడుదల చేస్తూ, ప్రాజెక్ట్ భద్రతను అత్యవసర ప్రాధాన్యతగా తీసుకుని వ్యవహరిస్తున్నారు. వర్షాలు కొనసాగితే మిగతా లిఫ్ట్ ప్రాజెక్టులు, కాలువల ద్వారా నీటి వినియోగం మరింతగా పెరిగే అవకాశం ఉంది.