Rising 2047 Vision | గ్లోబల్ సమ్మిట్కు రండి..

Rising 2047 Vision | గ్లోబల్ సమ్మిట్కు రండి..
రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు సీఎం రేవంత్ ఆహ్వానం
Rising 2047 Vision | ఢిల్లీ, ఆంధ్రప్రభ : ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఎంపీ ప్రియాంక గాంధీ(MP Priyanka Gandhi)తో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. హైదరాబాద్ భారత్ ఫ్యూచర్ సిటీలో ఈనెల 8, 9 తేదీల్లో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్(Rising Global Summit)కు రావాలని ప్రత్యేకంగా ఆహ్వానించారు.
భవిష్యత్తులో తెలంగాణ అభివృద్ధి, ఆదాయ వృద్ధి లక్ష్యంగా రూపొందించిన తెలంగాణ రైజింగ్ 2047 విజన్(Rising 2047 Vision) డాక్యుమెంట్ గురించి వివరించి.. ఆహ్వాన పత్రికను అందించారు. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఎంపీలు, ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ ఈ భేటీలో పాల్గొన్నారు.
