Mysaa | భ‌య‌పెడుతున్న ర‌ష్మిక..

నేషనల్ క్రష్ రష్మిక మందన్న తాజాగా నటిస్తున్న మూవీ మైసా.. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రూపొందుతున్న ఈ మూవీ ఫ‌స్ట్ లుక్ ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఈ సినిమాలో రష్మిక మునుపెన్నడూ కనిపించని సరికొత్త పాత్రలో దర్శనమివ్వనుంది.. ఈ మేరకు విడుదల చేసిన టైటిల్ పోస్టర్ ప్రేక్షకుల్లో ఉత్కంఠను రేకెత్తిస్తోంది.

ఈ చిత్రానికి రవీంద్ర పూలే దర్శకత్వం వహించనుండగా, అన్‌ఫార్ములా ఫిల్మ్స్‌ సంస్థ నిర్మిస్తోంది. తెలుగుతో పాటు మరో నాలుగు భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో ‘మైసా’ విడుదల కానుంది. చిత్ర బృందం విడుదల చేసిన టైటిల్ పోస్టర్‌లో రష్మిక యోధురాలిగా, భ‌య‌పెట్టే అవతారంలో కనిపించింది. ‘

ఈ కొత్త ప్రాజెక్ట్ గురించి రష్మిక స్పందిస్తూ… ‘‘నేను ఎప్పుడూ కొత్తదనం, వైవిధ్యం ఉన్న కథలకే ప్రాధాన్యత ఇస్తాను. ‘మైసా’ అలాంటి చిత్రమే. ఇది నేను ఇంతకు ముందెన్నడూ చేయని పాత్ర, అడుగుపెట్టని ప్రపంచం. ఈ సినిమాను మీ ముందుకు తీసుకురావడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఇది ఆరంభం మాత్రమే’’ అని ఆమె తెలిపింది.

Leave a Reply