BJP | ఎమ్మెల్సీ అభ్య‌ర్ధి ఎంపిక‌పై రాజాసింగ్ గ‌రంగ‌రం..

హైద‌రాబాద్ – నీ మనిషి నా మనిషి అని ఇంకా ఎన్ని సంవత్సరాలు ఈ తమాషా అని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. హైదారాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థిగా గౌతమ్ రావుని పార్టీ ప్రకటించిన నేపథ్యంలో రాజా సింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సొంత పార్టీ నేతలపై మరోసారి మండిపడ్డారు. “బీజేపీలో ఉన్న ఆ పెద్ద అధికారి మేకప్ మెన్, ఆఫీస్ టేబుల్ ఎవరు సాఫ్ చేస్తే వాళ్ళకి పెద్ద పెద్ద పోస్టులు పెద్ద పెద్ద టికెట్లు ఇస్తున్నారు. అన్ని పోస్టులు మీ పార్లమెంట్ మెంబర్స్ కే వస్తాయి. మిగతా పార్లమెంట్లో బీజేపీ కార్యకర్తలు అధికారి సీనియర్లు కనబడత లేరా? చేసేవాళ్లకే పోస్టులు టికెట్లు మిగతావాళ్లు మీ గులాంగిరి చేయరు కదా అందుకోసం వాళ్లకి పక్క పెడుతున్నారు.” అని ఆయన అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *