పర్వతగిరి, జూన్16 (ఆంధ్ర ప్రభ) : మండలంలోని చెరువు కొమ్ము తండా (Cheruvukommu Thanda) లో ఇందిరమ్మ ఇల్లు రాలేదని దారవత్ సుమన్ గ్రామంలోని మంచినీటి వాటర్ ట్యాంక్ (Water tank) ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని దాదాపు మూడు గంటల పాటు నిరసన తెలిపాడు.
గతంలో తన ఇల్లు కాలిపోయిందని, తనకు ఇందిరమ్మ ఇల్లు (Indiramma Illu) కేటాయించాలని కోరాడు. విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కడికి చేరుకొని అతన్ని కిందికి దించి సముదాయించి నచ్చజెప్పారు. స్థానికుల సమాచారం ప్రకారం… గత ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వగా, బెడ్ లెవెల్ వరకు నిర్మాణం పూర్తి చేశాడు. అదే బెడ్ పై ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని నిరసన చేపట్టాడు. పోలీసులు, ఫైర్ సిబ్బంది అతన్ని సముదాయించి కిందకు దించడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.