కడెం, జూన్ 17 (ఆంధ్రప్రభ) : కడెం మండలంలోని లింగాపూర్ (Lingapur) గ్రామానికి చెందిన పలువురు అర్హులైన నిరుపేదలు తమకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని కోరుతూ మంగళవారం మండలంలోని లింగాపూర్ గ్రామపంచాయతీ కార్యాలయం ముందు, లింగాపూర్ ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన (concern) చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… లింగపూర్ గ్రామంలో అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు రాలేదని, ఇండ్లు, భూములున్నవారికి ఇందిరమ్మ ఇండ్లు (Indiramma houses) మంజూరు చేశారని, తమకు భూములు, ఇండ్లు లేకున్నా జాబితాలో తమ పేర్లు రాలేవని, తాము నిరుపేదలమని, దయచేసి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని, అధికారులను, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్ ను కోరారు.
దాదాపు నాలుగు గంటలు (Four hours) ఎండలో కూర్చొని పేదలు ఆందోళన చేస్తుండడంతో అందులో నుండి ఒక మహిళ ఎండ వేడిమి తట్టుకోలేక స్పృహ తప్పి పడిపోయింది. కాగా అధికారులు, ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోళన చేస్తున్నా… వారి వద్దకు ఎవరు కూడా వచ్చి ఇందిరమ్మ ఇండ్ల గురించి ఎలాంటి హామీ ఇవ్వలేదు.. ఇకనైనా ప్రజా ప్రతినిధులు, అధికారులు స్పందించి నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసి ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు.