Polling | ఐదు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు – ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్

ఢిల్లీ, దేశంలో వివిధ రాష్ట్రాల్లోని ఐదు అసెంబ్లీ (Assembly ) యోజక వర్గాలకు సంబంధించిన ఉప ఎన్నిక (bye election) పోలింగ్ (polling ) ప్రశాంతంగా కొనసాగుతున్నది. . నేటి ఉదయం 7.00 గంటలకు ఈ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. ఇక ఈ ఉప ఎన్నికల పోలింగ్ ఈ రోజు సాయంత్రం 6.00 గంటల వరకు జరగనుంది. అయితే పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా ఓటర్లు ( voters ) క్యూ లైన్‌లో నిలబడి ఉంటే.. వారికి సైతం తమ ఓటు హక్కు వినియోగించుకునే వెసులుబాటును ఎన్నికల సంఘం కల్పించింది.

పశ్చిమ బెంగాల్‌లోని కాళీగంజ్, కేరళలోని నీలాంబుర్, పంజాబ్‌లోని లూథియాన పశ్చిమ, గుజరాత్‌లోని కాడి, విశవదార్ అసెంబ్లీ స్థానాలకు ఈ ఉప ఎన్నిక జరుగుతోంది. ఈ ఉప ఎన్నిక నేపథ్యంలో ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.

అలాగే పోలింగ్ స్టేషన్లలో సీసీ కెమెరాలు సైతం ఏర్పాటు చేసినట్లు వివరించింది. ఈ ఉప ఎన్నికల ఫలితాలు జూన్ 23వ తేదీన వెల్లడికానున్నాయి. మరోవైపు కేరళ, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు ఉప ఎన్నికల్లో ఓటర్లు ఏ పార్టీ వైపు మొగ్గు చూపనున్నారనేది ఆసక్తికర అంశంగా మారింది.

Leave a Reply