ఆశీర్వదించి అండగా నిలవండి గ్రామాన్ని అభివృద్ధి చేస్తా

  • పారేవుల సర్పంచ్ అభ్యర్థి కటికె అంజమ్మ ఆంజనేయులు

మక్తల్ , ఆంధ్రప్రభ : గ్రామపంచాయతీ ఎన్నికల్లో తనను ఆశీర్వదించి అండగా నిలవండి గ్రామాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తానని కాంగ్రెస్ పార్టీ మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కటికె.అంజమ్మ ఆంజనేయులు అన్నారు.

సర్పంచ్గా గెలిపిస్తే నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలోనే పారేవుల గ్రామాన్ని మంత్రి వాకిటి శ్రీహరి సహకారంతో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని అన్నారు.

సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ మద్దతుతో పోటీ చేస్తున్న కటికె అంజమ్మ ఆంజనేయులు ఆదివారం గ్రామంలో ముమ్మరంగా ఇంటింటి ప్రచారం చేపట్టారు.

ఓటర్థను కలుసుకొని గ్రామ అభివృద్ధి కోసం ఎన్నికల్లో తనకు సర్పంచిగా అవకాశం కల్పించవలసిందిగా విన్నవించారు. తనను సర్పంచ్ గా గెలిపిస్తే చేపట్టబోయే అభివృద్ధి పనులను ఓటర్లకు వివరించి మద్దతును కోరారు.

పనిచేసే ప్రభుత్వానికి ప్రజలు అండగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి రాజకీయాలకు అతీతంగా అందజేయడమే తన లక్ష్యమని అన్నారు.

గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఇతరుల మాయమాటలకు మోసపోకుండా నిస్వార్ధంగా సేవ చేసేందుకు మహిళలగా ముందుకు వచ్చిన తనకు అండగా నిలవాల్సిందిగా ఆమె ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

గ్రామంలో నెలకొన్న సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తానని తనకు మద్దతునిచ్చి సర్పంచ్ గా గెలిపించవలసిందిగా కటికె అంజమ్మ ఆంజనేయులు గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ డైరెక్టర్ విష్ణువర్థన్ ,రవీందర్ రెడ్డి, మణివర్థన్,ఇటిక్యాల ఆంజనేయులు, ఆంజనేయులు, గోపాల్ , లింగారెడ్డి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply