ఆంధ్రప్రభ : ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు వేగం పెంచిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తాజాగా కీలక విషయాలను వెలుగులోకి తీసుకొచ్చింది.
ప్రధాన నిందితుడిగా భావిస్తున్న ప్రణీత్ రావ్ ఫోన్ను సిట్ అధికారులు ఫోరెన్సిక్గా పరిశీలించగా, దానిలో ట్యాపింగ్కు సంబంధించిన కొన్ని చాటింగ్ హిస్టరీలు, సంభాషణలు, ఆడియో రికార్డింగ్స్ లభ్యమయ్యాయి.
ప్రణీత్ రావ్ ఫోన్లో గుర్తించిన సమాచారం ప్రకారం, ట్యాపింగ్ బాదితుల జాబితాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, మాజీ మంత్రి ఈటల రాజేందర్ వంటి ప్రముఖుల పేర్లు ఉండడం కలకలం రేపుతోంది.
ఈ వ్యవహారంపై మరిన్ని ఆధారాలు సేకరించేందుకు సిట్ మరింత లోతుగా విచారణ జరుపుతోందని సమాచారం. ఈ కేసు తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది.