Patangi Toll Plaza | రూ. 51 లక్షల విలువైన గంజాయి పట్టివేత

ఆంధ్రప్రభ / చౌటుప్పల్ -. చౌటుప్పల్ మండల పరిధిలోని పంతంగి టోల్ ప్లాజా వద్ద ఏసీపీ పటోళ్ల మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం వాహనాలను తనిఖీ చేస్తూ 51 ప్యాకెట్లలో 102 కిలోల గంజాయిని మారుతి స్విఫ్ట్ డిజైర్ కారులో అక్రమంగా తరలిస్తున్న విషయాన్ని గుర్తించి పోలీసులు పట్టుకొని నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు.

దీనిపై పై ఏసీపీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో గంజాయి అక్రమ రవాణా వివరాలను వెల్లడించారు.

డిసిపి తెలిపిన వివరాల ప్రకారం మహారాష్ట్రలోని బీడు పట్టణానికి చెందిన నకుల్ కైలాస్ గైకావాడ్ గత ఐదు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం అటవీ ప్రాంతం నుండి కారులో గంజాయిని అక్రమంగా మహారాష్ట్రకు తరలించి అమ్మేవాడని, మొదట్లో ప్రమోద్, సచిన్ మన వ్యక్తులతో కలిసి వ్యాపారం చేసేవాడని, వారితో విభేదాలు రావడంతో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సేటు అనే వ్యక్తితో కలిసి వ్యాపారం కొనసాగిస్తున్నాడని, అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారాం జిల్లా నర్సీపట్నం గ్రామానికి చెందిన వీరబాబు ద్వారా గంజాయిని కొనుగోలు చేసి కారులో నెంబర్ ప్లేట్లు మారుస్తూ మహారాష్ట్రకు వెళ్లి అమ్మేవాడన్నారు.

గంజాయి వ్యాపారంలో భాగంగా ఈనెల 1వ తేదీన ఆంధ్ర ప్రాంతంలోని అనకాపల్లి జిల్లా కన్నూరు గ్రామానికి వెల్లగా ముందుగా చేసుకున్న ఒప్పందం మేరకు వీరబాబు102 కిలోల గంజాయిని 51 ప్యాకెట్లుగా తయారుచేసి పెట్టగా వాటిని కైలాస్ గైకావాడ్ తన మారుతి షిఫ్ట్ డిజైర్ కారు డిక్కీలో పెట్టుకొని విజయవాడ, సూర్యాపేట, నార్కట్ పల్లి, చౌటుప్పల్, హైదరాబాద్, మహారాష్ట్రకు వెళుతుండగా చౌటుప్పల్ మండలంలోని పంతంగి టోల్ ప్లాజా వద్ద ముందుగా అందిన నమ్మదగిన సమాచారం మేరకు ఏసీబీ మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ జి మన్మధ కుమార్, ఎస్సైలు కనుకటి యాదగిరి, ఎస్ కృష్ణ మల్, పోచంపల్లి ఎస్సై ఎల్ భాస్కర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ, కానిస్టేబుల్ లు సందీప్, భరద్వాజ్, హెచ్ జి పాపయ్య తదితరులు కలిసి గంజాయిని అక్రమ రవాణా చేస్తున్న కారును పట్టుకొని నిందితుడు కైలాస్ గైకావాడ్ ను అదుపులోకి తీసుకోవడంతో పాటు గంజాయిని, కారును, నకిలీ నెంబర్ ప్లేట్లను, రెండు సెల్ ఫోన్ లను, రెండు వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లుగా డిసిపి రాజేష్ చంద్ర తెలిపారు..నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచడం జరిగిందని, సేటు, వీరబాబు లపై కేసులను నమోదు చేయడం జరిగిందని డిసిపి తెలిపారు. డ్రగ్స్ మహమ్మారి నియంత్రణ కోసం ప్రజలు తమ వంతు సహకారం అందించాలని కోరారు

కాగా,. కారులో అక్రమ రవాణా చేస్తున్న గంజాయిని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఏసీపీ, ఇన్స్పెక్టర్, ఎస్ఐలను, సిబ్బందిని డీసీపీ రాజేష్ చంద్ర అభినందించారు. ప్రోత్సాహకంగా వారికి నగదు పారితోషకాలను అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *