పాక్‌ హైకమిషన్‌ ఉద్యోగి బహిష్కరణ‌.. దేశం విడిచి పోవాల‌న్న భార‌త్‌

పాకిస్థాన్‌తో కాల్పుల విరమణ కొనసాగుతున్న వేళ భారత్‌ కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్‌ హైకమిషన్‌ ఉద్యోగిని దేశం నుంచి బహిష్కరించింది. 24 గంటల్లోగా భారత్ నుంచి వెళ్లిపోవాలని ఆదేశం జారీ చేసింది. ఈ మేరకు భారత విదేశాంగశాఖ ఓ ప్రకటనను విడుదల చేసింది.

తమ నిర్ణయాన్ని తెలియజేస్తూ భారత్‌లో పాకిస్థాన్‌ వ్యవహారాలు పర్యవేక్షిస్తున్న అధికారికి భారత విదేశాంగ శాఖ లేఖ రాసింది. అయితే, ఆ అధికారి పేరును మాత్రం వెల్లడించలేదు. దిల్లీలోని పాకిస్థాన్‌ హైకమిషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఓ ఉద్యోగిని దేశ బహిష్కరణ చేయాలని నిర్ణయించామని విదేశాంగ శాఖ తెలిపింది. అధికార హోదాకు తగ్గట్లు ప్రవర్తించలేదని, అందుకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొంది. 24 గంటల్లోగా సదరు అధికారి భారత్‌ విడిచి వెళ్లిపోవాలని ఆదేశించింది.

Leave a Reply