NZB| వరి ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి… రాష్ట్ర సివిల్ సప్లై ఓఎస్డీ

బిక్కనూర్, ఏప్రిల్ 21 ఆంధ్రప్రభ : వరి ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని రాష్ట్ర సివిల్ సప్లై టాస్క్ ఫోర్స్ ఓఎస్డీ శ్రీధర్ రెడ్డి చెప్పారు. సోమవారం కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండల కేంద్రంలో గల వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఇప్పటి వరకు రైతుల నుండి కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.

అనంతరం మాట్లాడుతూ.. రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేయాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల వద్ద టెంటుతో పాటు మంచినీటి వసతి కల్పించాలని తెలిపారు. రైతుల ఖాతాలో డబ్బులు తొందరగా పడే విధంగా ట్యాబ్ ఎంట్రీ వేగవంతం చేయాలని చెప్పారు. కొనుగోళ్లకు సంబంధించిన పలు రికార్డులను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై టాస్క్ ఫోర్స్ సీఐ అజయ్ బాబు, లక్ష్మయ్య, ఎస్సై శ్రీనివాసరావు, ఏఎస్ఓ సుదర్శన్ రెడ్డి, ఎన్ ఫోర్స్ మెంట్ డిప్యూటీ తహసీల్దార్ కిష్టయ్య, అసిస్టెంట్ రిజిస్టర్ రమేష్, సొసైటీ అధ్యక్షులు భూమయ్య, ఉపాధ్యక్షులు రాజిరెడ్డి, సీఈవో నరసింహులు, సిబ్బంది గంగరాములు, రవి, స్వామి, రైతులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *