భారత రక్షణ అధికారుల మీడియా సమావేశం
ఆపరేషన్ సింధూర్ వివరాలు వెల్లడి
ఉగ్రవాదులకు పాక్ మిలిటరీ మద్దతుగా ఉండటం సిగ్గుచేటు
పాక్ సైన్యానికి జరిగిననష్టానికి బాధ్యతవహిస్తున్నాం
పాక్ ప్రజలకు ఎలాంటి నష్టం తలపెట్టలేదు-
భారత్పై పాక్ దాడులను నిలువరించాం-
కశ్మీర్, పీవోకేలో ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేశాం
చైనా తయారీ ఆయుధాలను పడగొట్టాం-
నూర్ఖాన్, రహీంయార్ఖాన్ ఎయిర్ బేస్లపై దాడిచేశాం
రక్షణ వ్యవస్థలతో శత్రువుల ఆయుధాలు చిత్తుచేశాం
ఆపరేషన్ సిందూర్ వివరాలను వెల్లడించిన ఎయిర్ మార్షల్ ఏకే భారతి
న్యూఢిల్లీ – పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)లో భారత్ చేపట్టిన ఆపరేషన్ విజయవంతమైందని ఎయిర్ మార్షల్ ఏకే భారతి తెలిపారు. ఉగ్రవాదుల శిబిరాలే లక్ష్యంగా యుద్ధం చేశామని చెప్పారు. పాకిస్థాన్, పీవోకేలో ఉగ్రవాదుల స్థావరాలు ధ్వంసం చేశామన్నారు. పాక్ చెందిన అనేక డ్రోన్లు, మిసైళ్లను తిప్పికొట్టామని, పాక్ భూభాగంలో జరిగిన నష్టానికి పాక్ ఆర్మీదే బాధ్యత అని చెప్పారు. నేడు ఆయన త్రివిద దళాలకు చెందిన ప్రతినిధులతో కలసి కొత్త డిల్లీలో మీడియాతో మాట్లాడారు.
తమ లక్ష్యం కేవలం ఉగ్రవాదులను ఏరివేయడమేని తేల్చి చెప్పారు.. పాకిస్థాన్ లోని ఉగ్రవాద శిబిరాలపై దాడిచేసి అనేక మందిని హతం చేశామన్నారు.. ఈ సందర్భంగా పాక్ సైన్యం తమపై ఎదురుదాడి చేసిందని పేర్కొన్నారు.. దీంతో తాము ఎదురుదాడికి దిగామన్నారు.. ఉగ్రవాదంపై చర్యలను పాక్ తమపై దాడికి ఊహించుకుని మనపై దాడి చేసిందని, దానిని తాము అడ్డుకున్నామన్నారు.
పాక్ ప్రయోగించిన చైనా మిస్సైల్స్ ను ఆకాశ్ రక్షణ వ్యవస్థతో తునాతునకలు చేశామని ఏకే భారతి వివరించారు.. కేవలం స్వదేశీ రక్షణ వ్యవస్థతోనే పాక్ డ్రోన్లు, మిస్సైల్స్ తోనే అడ్డుకున్నామన్నారు.. ఉగ్రవాదులకు పాక్ మిలిటరీ మద్దతుగా ఉండటం సిగ్గుచేటుగా ఆయన అభివర్ణించారు. . ఈ ఘర్షణలో పాకిస్థాన్ సైన్యానికి ఏదైనా నష్టం వాటిల్లితే, దానికి పూర్తి బాధ్యత పాకిస్థాన్దే అవుతుందని రక్షణ శాఖ అధికారులు తేల్చిచెప్పారు. తాము చేసిన దాడిలో పాక్ ప్రజలకు ఎలాంటి నష్టం తలపెట్టలేదని పేర్కొన్నారు.. ఆపరేషన్ సిందూర్ ద్వారా కశ్మీర్, పీవోకేలో ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేశామని చెప్పారు.. ఈ దాడిలోచైనా తయారీ ఆయుధాలను పడగొట్టామన్నారు. నూర్ఖాన్, రహీంయార్ఖాన్ ఎయిర్ బేస్లపై దాడిచేశామని , వాటిని 60 శాతం ధ్వంసచేశామని పేర్కొన్నారు.. అలాగే స్వదేశీ క్షిపణులతోనే పాక్ రక్షణ వ్యవస్థలను, శత్రువుల ఆయుధాలు చిత్తుచేశామని పేర్కొన్నారు.. తాము పాక్ లోని అణు స్థావరాలపై ఎటువంటి దాడులు చేయలేదని ఆయన స్పష్టం చేశారు. అలాగే పాక్ కిరాణ హిల్స్ పై కూడా దాడులు చేయలేదని, అసలు అక్కడ ఏముందో కూడా తమకు సమాచారం లేదన్నారు.. పాక్ తమపై మిస్సైల్స్ దాడి జరిపినా మన మూడంచెల రక్షణ వ్యవస్థను దాటుకుని ముందుకు రాలేకపోయందన్నారు.. మన అబేధ్యమైన గగనతల వ్యవస్థ ముందు పాక్ ఎత్తులు పారలేదన్నారు..
ఈ ఆపరేషన్ లో నావికా దళం, వైమానిక దళం , ఆర్మీ ప్రశంసనీయమైన పాత్ర పోషించాయని అన్నారు. ఇక వైపు నుంచి జరిగిన షెల్లింగ్ దాడులలో మన దేశానికి చెందిన అయిదుగురు జవాన్లను కోల్పోయామని వివరించారు.
.