NZB | ఆ స్కూల్లో 7వ తరగతి వరకే అనుమతి : ఎంఈఓ హెచ్చరిక

నిజామాబాద్, (ఆంధ్రప్రభ) : జిల్లా నార్త్ మండలంలోని ఇస్లాపూర్‌లో ఉన్న ప్రైమ్ స్కూల్ ఆఫ్ ఎక్సిలెన్సీకి కేవలం 7వ తరగతి వరకు మాత్రమే అనుమతులు ఉన్నాయని, ఆపై తరగతులకు అనుమతులు లేవని మండల విద్యాశాఖ అధికారి (ఎంఈఓ) వీఎన్. గౌడ్ (బుధవారం) ఓ ప్రకటనలో తెలిపారు.

ఈ నేపథ్యంలో 8వ తరగతికి మించి ఉన్న తరగతుల్లో విద్యార్థులను చేర్పించరాదని తల్లిదండ్రులను ఆయన హెచ్చరించారు. ప్రభుత్వం అనుమతించిన పాఠశాలల్లోనే పిల్లలను చేర్పించాలని, లైసెన్సు లేని తరగతుల్లో చేర్పించడం వల్ల విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం పడే ప్రమాదం ఉందని ఎంఈఓ స్పష్టం చేశారు.

తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించి, తమ పిల్లల విద్యా భవిష్యత్తు కోసం జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

Leave a Reply