Not End | అస‌లు సినిమా ముందుంది…మ‌రిన్ని దాడులుంటాయ‌న్న ఆర్మీ మాజీ చీఫ్


న్యూ ఢిల్లీ – పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లోని ఉగ్రవాద స్థావరాలపై జరిగిన ఈ దాడుల నేపథ్యంలో భారత సైన్యానికి చెందిన మాజీ ఉన్నతాధికారులు కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా, ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవణే సామాజిక మాధ్యమంలో చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం జరిపిన దాడులను ఉద్దేశిస్తూ ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ నరవణే, “సినిమా అప్పుడే అయిపోలేదు.. ఇంకా ఉంది” అంటూ ఒక పోస్ట్ చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

దాడులు కొనసాగించాలి

మరో మాజీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్, జనరల్ శంకర్ రాయ్‌చౌదరి కూడా ఈ దాడులపై స్పందించారు. ఉగ్ర స్థావరాలపై భారత బలగాలు చేసిన దాడిని అద్భుతమైన ప్రణాళికతో కూడిన గొప్ప ఆపరేషన్‌గా ఆయన ప్రశంసించారు. ఈ దాడులను భారత్ ఇక్కడితో ఆపకూడదని, కొనసాగించాలని సూచించారు. ఇది యుద్ధం లాంటి పరిస్థితి కాదని, ఇప్పటికే ఇరుదేశాల మధ్య అప్రకటిత యుద్ధం కొనసాగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.

Leave a Reply