నంద్యాల బ్యూరో మే 25 ఆంధ్రప్రభ…… కర్నూలు చిత్తూరు జాతీయ రహదారిపై నంద్యాల హైవే టోల్ ప్లాజా దాటిన తర్వాత రైతు నగరం సమీప ప్రాంతం వద్ద ఆదివారం వేకువ జామున రవి టు ట్రావెల్ బస్సు అదుపు తప్పింది. పెద్ద ప్రమాదం నుంచి ప్రయాణికులు బయటపడ్డారు.ప్రవేటు బస్సు హైవే నుంచి అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకుపోయింది.ఈ ప్రమాదంలో పది మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.
అందులో ముగ్గురికి సీరియస్ గా ఉండడంతో ప్రధమ చికిత్స చేసి అత్యవసర చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రైవేటు ట్రావెల్ బస్సు హైదరాబాదు నుంచి తిరుపతికి వెళుతున్నది. బస్సులు సుమారుగా 40 మంది ప్రయాణికులు ఉన్నారు. సుదూర ప్రాంతం ప్రయనించడంతో డ్రైవర్ నిద్రమత్తులో ఉండటమే ఈ ప్రమాదాన్ని కారణమని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.