Nandyala | అమరవీరుల త్యాగాలను స్మరించుకుందాం

Nandyala | అమరవీరుల త్యాగాలను స్మరించుకుందాం

  • ఎస్పీ సునీల్ షొరాణ్

Nandyala | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : బ్రిటిష్ పాలకుల నుంచి దేశాన్ని కాపాడిన త్యాగ వీరులు అమరవీరులను స్మరించుకోవాల్సిన అవసరం ఉందని జిల్లా ఎస్పీ సునీల్ షేరన్ పేర్కొన్నారు. 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ కుటుంబ సమేతంగా హాజరై ఘనంగా నిర్వహించడం జరిగింది. జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం పోలీసు కార్యాలయ సిబ్బందికి, పరిపాలన ఉద్యోగులకు మిఠాయిలు పంచి పెడుతూ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అనంతరం విధినిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ప్రశంసాపత్రాలను అందించారు.

ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ తోపాటు స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్ట‌ర్లు, రిజర్వు ఇన్‌స్పెక్ట‌ర్లు మంజునాథ్ సురేష్ బాబు ఆర్‌ఎస్‌ఐ కాళీ చరణ్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply