ఏపూర్లో మహిళ హత్య
సూర్యాపేట, ఆంధ్రప్రభ : ఆత్మకూర్ ఎస్.మండలం(Atmakur S. Mandalam) ఏపూరి గ్రామంలో మహిళ దారుణ హత్య కలకలం సృష్టించింది. గ్రామానికి చెందిన కొరివి బిక్షమమ్మ(Korivi Bikshamamma)(40)ను హత్య చేశారు.
కొంతమంది నడిరోడ్డుపై గొంతు కోసి పరారయ్యారయినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఘటన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.