- మురళి నాయక్ తల్లిదండ్రులకు జగన్ పరామర్శ
- మురళి నాయక్ త్యాగం రాష్ట్రానికి గర్వకారణం
- నాయక్ కుటుంబానికి రూ.25లక్షలు జగన్ సాయం
శ్రీ సత్యసాయి బ్యూరో , ఆంధ్రప్రభ భారత్- పాకిస్తాన్ ల మధ్య జరిగిన యుద్ధంలో వీరమరణం పొందిన అగ్నివీర్ జవాన్ మురళి నాయక్ యువతకు స్ఫూర్తి దాయకమని అన్నారు మాజీ ముఖ్యమంత్రి, వైసిపి అధ్యక్షుడు జగన్ ..శ్రీ సత్యసాయి జిల్లాలోని గోరంట్ల మండలం కల్లితాండ గ్రామాన్ని సందర్శించారు. , ఇటీవల భారత దేశ తరఫున పాకిస్తాన్ తో యుద్ధంలో పోరాడి వీర మరణం పొందిన మురళి నాయక్ తల్లిదండ్రులు శ్రీరామ్ నాయక్, జ్యోతిబాయ్ లను, వారి బంధువులను పరామర్శించారు. జగన్ సుమారు 20 నిమిషాల కు పైగా నాయక్ తల్లిదండ్రులతో ఉన్నారు. ఈ సందర్భంగా మురళి నాయక్ మరణం విషయం, దీనికి ముందు మురళి నాయక్ చదువుల్లో ఎలా ఉన్నాడు. ఆది నుంచి మిలిటరీ పట్ల మురళి నాయక్ కు ఉన్న మక్కువ తదితర అంశాల గురించి మురళి తల్లిదండ్రులు జగన్ కు వివరించారు.
అనంతరం జగన్ మీడియాతో మాట్లాడుతూ మురళి నాయక్ త్యాగం ఆంధ్ర రాష్ట్రానికి గర్వకారణమని అన్నారు. మురళి నాయక్ ను సజీవంగా తీసుకురాలేనప్పటికీ, ఆ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అందించిన ఆర్థిక సహాయం, ప్రకటించిన ఇతర సదుపాయాలు పట్ల జగన్ కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఇదే సందర్భంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున తమ వంతు బాధ్యతగా రూ 25 లక్షలు ఆర్థిక సహాయం అందజేసి, అన్ని విధాల ఆ కుటుంబానికి తోడుగా ఉంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి జిల్లా అధ్యక్షురాలు కేవీ ఉషశ్రీ చరణ్, మాజీ ఎమ్మెల్యేలు వై విశ్వేశ్వర్ రెడ్డి, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి, అత్తిరు చాంద్ బాషా, కదిరి నసమన్వయకర్త వైకాపా సమన్వయకర్త బిఎస్ మక్బూల్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.