MP Aravind | గప్పాగప్పా గుద్ది… రప్పారప్పా జైల్‌లో వేయాలి

హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : పదేళ్ల పాటు రాష్ట్రాన్ని(ten years ) పాలించి.. అన్ని వ్యవస్థలను భ్ర‌ష్టు పట్టించిన బీఆర్ఎస్‌కు(brs ) మళ్లీ 3.0 ఏంటని నిజామాబాద్ బీజేపీ ఎంపీ అర‌వింద్‌ (mp aravind ) మండిపడ్డారు. వాళ్ల మొహాలకు మూడు సీట్లు వస్తే గొప్ప అంటూ అన్నారు. రానున్న సాధారణ ఎన్నికల్లో సిద్దిపేట జిల్లాలో ఒక్క హరీశ్ రావు (harish rao ) తప్ప.. మరెవరూ గెలిచే పరిస్థితి లేదన్నారు. ఆయనకు కూడా ఆ ఒక్క నియోజవర్గంలో ఆదరణ ఉందే తప్పా.. మరెక్కడ లేద‌ని చెప్పారు. ఆఖరికి కేసీఆర్‌, కేటీఆర్ ( KCR, KTR )కూడా ఓడిపోతార‌ని జోష్యం చెప్పారు.

గ‌ప్పాగ‌ప్పా గుది.. ర‌ప్పార‌ప్పా జైలులో వేయాలి
తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత త‌న రాజ‌కీయ జీవితం ముగించాల‌ని ప్ర‌య‌త్నిస్తున్న ఆమె అన్న‌య్య కేటీఆర్ కు కూడా అదే గ‌తి ప‌ట్ట‌బోతోంద‌ని ఎంపీ అర‌వింద్ అన్నారు. కాళేశ్వరం స్కామ్‌లో కేసీఆర్‌ను, ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్ ఉన్నార‌న్నారు. గప్పా గప్పా గుద్ది.. రప్పా రప్పా జైలులో వేయాలని.. అలా చేస్తే మరిన్ని స్కామ్‌లు వెలుగులోకి వస్తాయని అన్నారు. అవినీతి కేసుల్లో బీఆర్‌ఎస్‌ నేతలను జైలులో పెట్టకపోతే సీఎం రేవంత్‌ రెడ్డి రాజకీయ జీవితం భూస్థాపితం అవుతుందని జోస్యం చెప్పారు.

Leave a Reply