ముంపు ప్రాంత బాధితులకు పరామర్శ
హన్మకొండ, ఆంధ్రప్రభ : వరంగల్ నగరం (Warangal city) లో అతలాకుతలమైన ప్రాంతాలను వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి (Naini Rajender Reddy) పరిశీలించారు. హన్మకొండ జిల్లాలో ముంపు ప్రాంతాలను ఈ రోజు ఉదయం ఆయన పర్యటించారు. గోకుల్ నగర్, గాంధీ నగర్, సమ్మయ్య నగర్ ప్రాంతాల్లో వరద బాధితులను పరామర్శించారు. ప్రజలు ఎవరు ఆందోళన చెందావద్దని, బాధితులకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

