America | ఫ్లోరిడాలో రోడ్డు ప్రమాదం – ముగ్గురు తెలంగాణ వాసులు దుర్మ‌ర‌ణం

అమెరికాలోని ఫ్లోరిడా లో జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో తెలంగాణలోకి రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గానికి చెందిన ముగ్గురు ముగ్గురు మ‌ర‌ణించారు.. షాద్‌నగర్ నియోజకవర్గం కొందుర్గు మండలం టేకులపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మోహన్ రెడ్డి కూతురు ప్రగతి రెడ్డి (35), మనవడు హార్వీన్ (6), కూతురు అత్త సునీత (56) మృత్యువాత పడ్డారు. భారత కాలమాన ప్రకారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగినట్టు చెబుతున్నారు ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు అమెరికాలో మృతి చెందడం పట్ల టేకులపల్లి గ్రామం అశోక సముద్రంలో మునిగిపోయింది. .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *