Missiles Attack | ఇజ్రాయెల్ పై ఇరాన్ ఎదురు దాడి

టెల్‌ అవీన్ , ఆంధ్ర‌ప్ర‌భ :ఇజ్రాయెల్‌-ఇరాన్‌ మధ్య పోరు ఉధృతంగా సాగుతోంది. రెండు దేశాల నడుమ దాడులు, ప్రతిదాడులతో పశ్చిమాసియాలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇంతలో ఇజ్రాయెల్‌కు మద్దతుగా అమెరికా రంగంలోకి దిగడం ఈ ఉద్రిక్తతలకు మరింత ఆజ్యం పోసింది. ప్రస్తుతం ఇజ్రాయెల్‌లోని పలు ప్రాంతాలే లక్ష్యంగా ఇరాన్‌ క్షిపణులతో విరుచుకుపడుతోంది.ప్ర‌జ‌ల‌కు హెచ్చ‌రిక‌లు..ఇరాన్‌లోని అణుకేంద్రాలపై అమెరికా ప్రత్యక్ష దాడులు చేసిన కొన్ని గంటలకే తెహ్రాన్‌ స్పందించింది.

ఇరాన్‌ దాడులను ఇజ్రాయెల్‌ సైనిక దళాలు కూడా ధ్రువీకరించాయి. ఇరాన్ క్షిపణులు తమ దేశంపైకి దూసుకొస్తున్నాయని పేర్కొన్నాయి. ఆ క్షిపణులను అడ్డుకునేందుకు తాము ప్రయత్నిస్తున్నామని వెల్లడించాయి. కాగా, ఇరాన్‌ దాడులతో ఇజ్రాయెల్‌ రాజధాని టెల్‌ అవీవ్‌, జెరూసలెంతోపాటు పలు ప్రాంతాల్లో భారీ పేలుళ్లు వినిపించాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌ తన ప్రజలకు కీలక హెచ్చరికలు జారీ చేసింది. క్షిపణులు దూసుకొస్తున్నందున పౌరులు సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని సూచించింది. స్థానిక అధికారుల సూచనలను పాటించాలని, తదుపరి ఆదేశం వరకు అక్కడే ఉండాలని పేర్కొంది.

Leave a Reply