West Asia Tension | ఇరాన్ – ఇజ్రాయెల్ మ‌ధ్య క్షిప‌ణులు దాడులు – మూడో ప్ర‌పంచ యుద్ధానికి వ‌డి వ‌డిగా అడుగులు

మూడో ప్ర‌పంచ యుద్ధానికి వ‌డి వ‌డిగా అడుగులు
దాడులు ఆప‌బోమంటున్న రెండు దేశాలు
దాడి కాదు యుద్ధ‌మంటూ ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ
ఆప‌రేష‌న్ రైజింగ్ ల‌య‌న్ పేరుతో ఇజ్రాయెల్ దాడులు
‘‘ఆపరేషన్ ట్రూ ప్రామిస్’’ పేరుతో ఇరాన్ ఎదురుదాడి
ఏకంగా టెల్ అవీవ్‌, జెరుస‌లం పై క్షిఫ‌ణుల వ‌ర్షం

బాగ్దాద్ టెల్ ఆవీవ్ – ఇజ్రాయెల్‌, ఇరాన్‌ మధ్య యుద్ధం మొదలైంది. అయితే ఇరు దేశాల మధ్య శత్రుత్వం ఈనాటిది కాదు. 1948లో ఇజ్రాయెల్‌ ఏర్పడిన తర్వాత దశాబ్దాల పాటు మిత్ర దేశాలుగా ఉండేవి. కానీ 1979లో ఇస్లామిక్‌ విప్లవం తర్వాత శత్రువులుగా మారిపోయాయి. 46 ఏళ్లుగా ఇరు దేశాల మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఇరాన్‌ న్యూక్లియర్‌ ప్రోగ్రామ్‌తో తమ మనుగడకే ముప్పు అని భావించిన ఇజ్రాయెల్‌.. ఇరాన్‌పై దాడికి దిగింది. అటు ఇజ్రాయెల్‌ యుద్ధం కోరకుంటోందని, దీని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి ఇరాన్‌ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ హెచ్చరించారు. తాము జరిపేది దాడులు కాదని.. యుద్ధమని ఆయన స్పష్టం చేశారు.

ఇరాన్‌ – ఇజ్రాయెల్‌ మధ్‌య మిస్సైళ్ల దాడులతో మిడిల్‌ ఈస్ట్‌లో తీవ్ర ఉద్రిక్త, భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిణామాలను చూస్తుంటే మూడో ప్రపంచ యుద్ధం మొదలైనట్లేనని అంతర్జాతీయ నిపుణులు పేర్కొంటున్నారు. ఇరాన్‌ – ఇజ్రాయెల్‌ పోరును ఆపడం ఇక కష్టమేనని అభిప్రాయపడుతున్నారు. దీంతో వాణిజ్యపరంగా ప్రపంచ దేశాలపై తీవ్ర ప్రభావం పడుతుందని చెబుతున్నారు. ఆయిల్‌ ధరలు విపరీతంగా పెరిగే అవకాశం ఉందంటున్నారు.


ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. రెండు దేశాలు కూడా క్షిపణులతో విరుచుకుపడుతున్నాయి. శుక్రవారం తెల్లవారుజాము ఇజ్రాయిల్ ఇరాన్ అణు కేంద్రాలను, కీలక శాస్త్రవేత్తలు, అధికారులను టార్గెట్ చేస్తూ దాడులు చేసింది. దీనికి ప్రతీకారంగా శనివారం, ఇజ్రాయిల్ అతిపెద్ద నగరం టెల్ అవీవ్‌పై ఇరాన్ క్షిపణి దాడులు చేసింది. టెల్ అవీవ్‌తో పాటు రాజధాని జెరూసలెంలో కూడా పేలుళ్లు జరిగాయి. మరోవైపు, 24 గంటల్లోనే ఇజ్రాయిల్ మరోసారి ఇరాన్‌పై భీకర దాడి చేసింది.

‘‘ఆపరేషన్ ట్రూ ప్రామిస్’’ పేరుతో ఇరాన్ క్షిప‌ణి దాడులు

ఇజ్రాయిల్ పై దాడులకు ఇరాన్ ‘‘ఆపరేషన్ ట్రూ ప్రామిస్’’గా పేరు పెట్టింది. టెల్ అవీవ్‌పై జరిగిన తర్వాత ఒక వ్యక్తి మరణించగా, దాదాపుగా 34 మంది గాయపడినట్లు ఇజ్రాయిల్ అధికారులు తెలిపారు. దీనికి ప్రతిస్పందనగా ఇజ్రాయిల్ “ఆపరేషన్ రైజింగ్ సన్” కింద ఇరాన్‌పై దాడులు ప్రారంభించింది, ఇందులో కనీసం 78 మంది మరణించారు, 320 మందికి పైగా గాయపడ్డారు.

అణు కేంద్రాల‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడి…
ఇరాన్ అణ్వాయుధాన్ని అభివృద్ధి చేయకుండా నిరోధించే లక్ష్యంతో ఇజ్రాయెల్ శుక్రవారం అతిపెద్ద దాడిని ప్రారంభించింది. శనివారం తెల్లవారుజామున ఇరాన్, ఇజ్రాయిల్ వైమానిక, క్షిపణి దాడులకు దిగాయి. స్థానిక మీడియా నివేదికల ప్రకారం.. ఇరాన్ కీలకమైన వైమానిక స్థావరమైన మెహ్రాబాద్ ఎయిర్ పోర్టుపై ఇజ్రాయిల్ ప్రొజెక్టై్ల్స్‌తో దాడి చేసింది. ఈ దాడితో ఎయిర్ పోర్టు మంటల్లో చిక్కుకుంది. ఇరాన్ అణు కార్యక్రమాన్ని కూల్చేందుకు చర్యలు ఇప్పుడే ప్రారంభమైనట్లు ఇజ్రాయిల్ పీఎం బెంజమిన్ నెతన్యాహూ అన్నారు. ఇరాన్ ప్రజల్ని పేదరికంలో ముంచెత్తిన హంతక ఇస్లామిక్ పాలనపై దాడిగా అభివర్ణించారు. మరోవైపు, ఇజ్రాయిల్‌ని దారుణంగా దెబ్బతీస్తామని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హెచ్చరించారు.

ఇజ్రాయిల్ జరిపిన దాడుల్లో ఇరాన్ సాయుధ దళాలకు చెందిన వ్యక్తులు, శాస్త్రవేత్తలు మరణించారు. ఆర్మీ చీఫ్ జనరల్ మొహమ్మద్ బాఘేరి, పారామిలిటరీ రివల్యూషనరీ గార్డ్‌కు నాయకత్వం వహించిన వ్యక్తి జనరల్ హోస్సేన్ సలామి, రివల్యూషనరీ గార్డ్‌ బాలిస్టిక్ క్షిపణి ప్రోగ్రాం అధిపతి జనరల్ అమీర్ అలీ హజీజాదే హతమయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *