హైదరాబాద్, ఆంధ్రప్రభ : మిస్ వరల్డ్లో పాల్గొనడానికి వచ్చిన 109 దేశాల కంటెస్టర్లు మంగళవారం నాడు ప్రపంచ ప్రఖ్యాత చార్మినార్ వద్ద హెరిటేజ్ వాకింగ్ వహిస్తారు. దాదాపు నాలుగు ప్రత్యేక బస్సుల్లో చార్మినార్ వద్దకు చేరుకునే 109 దేశాల సుందరిమణులకు పాత బస్తీలో పాపులర్ అయిన మార్ఫా వాయిద్యాలతో స్వాగతం పలుకుతారు. చార్మినార్ వద్ద ప్రత్యేకంగా ఫోటోషూట్ నిర్వహిస్తారు. అనంతరం చార్మినార్ సమీపంలోని చుడీ బజారులో ఎంపిక చేసిన తొమ్మిది దుకాణాల్లో వివిధ రకాల గాజులు, ముత్యాల హారాలు తదితర అలంకరణ వస్తువుల షాపింగ్ నిర్వహిస్తారు.
హైదరాబాద్ బ్యాంగిల్స్, ముజీబ్ బ్యాంగిల్స్, కనహయ్యలాల్, మోతిలాల్ కర్వా, గోకుల్ దాస్ జరీవాల, కె ఆర్ కాసత్, జాజు పెరల్స్ ఏ హెచ్ జరీవాల, అఫ్జల్ మియా కర్చోబే వాలే దుకాణాల్లో షాపింగ్ నిర్వహిస్తారు. గాజులు తయారు చేసే విధానాన్ని స్వయంగా పరిశీలిస్తారు, అనంతరం సుప్రసిద్ధ చౌహన్లా ప్యాలెస్ లో ఏర్పాటుచేసే విందుకు హాజరవుతారు. మిస్ వరల్డ్ కాంటేస్టర్లకు మెహేంది వేయడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు అదేవిధంగా నిజామి సాంప్రదాయ దుస్తులను కూడా దరించడానికి ఏర్పాటు చేశారు. దీనితోపాటు రాష్ట్రంలో వివిధ పర్యాటక ప్రాంతాల విశిష్టతను తెలిపే సినిమాలను ప్రదర్శిస్తారు. చౌహన్లా ప్యాలెస్ లో నిజాం హ ప్రోగ్రాంహయంలో ఉపయోగించిన యుద్ధ ఆయుధాలు, గృహోపకరణ సామాగ్రి, నిజాం నవాబులు ఉపయోగించిన వివిధ రకాల వస్తువులు, ఓల్డ్ సిటీ సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేసే ఫోటో ప్రదర్శనలు మిస్ వరల్డ్ కంటెస్టర్లు తిలకిస్తారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులు విస్తృత ఏర్పాట్లను చేశారు.