WGL | లక్ష్మీనరసింహస్వామికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి సీతక్క

వాజేడు, మే 12 (ఆంధ్రప్రభ) : మంగపేట మండలం మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహ స్వామివారి కళ్యాణ మహో త్సవానికి మంత్రి సీతక్క కుటుంబ సమేతంగా హాజరై స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ఈ నెల 8వ తేదీ నుంచి 17 వరకు శ్రీ హేమాచల లక్ష్మీ నృసింహ స్వామి కళ్యాణ బ్రహ్మోత్సవాలు జరుగుతాయన్నారు. ఇక్కడకు వివిధ ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు.

పారిశుద్ధ్యం, తాగునీరు సక్రమంగా చేపట్టేలా చర్యలు తీసుకున్నాం. పార్కింగ్ స్థలాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సైన్ బోర్డులు, తాగునీరు, టాయిలెట్ తదితర అన్ని చర్యలు చేపట్టామన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) మహేందర్ జి, మండల అధికారులు, ఆలయ పూజారులతో పాటు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply