కౌడిపల్లి ఆంధ్రప్రభ – మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం వెంకట్రావ్పేట గేటు వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం అర్థరాత్రి హైదరాబాద్ నుంచి మెదక్ వైపు వెళ్తున్న ఆల్టో కారు ప్రమాదానికి గురైంది. వారు ప్రయాణిస్తున్న ఆల్టో కారును మరో కారు ఎదురుగా వచ్చి ఢీకొంది. ఈ ప్రమాద ధాటికి ఆల్టోకారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. మృతులను ఎండీ గౌస్, అలీ, అజీమ్ బేగంగా గుర్తించారు.
రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్న సంఘటనలో ముగ్గురు మృతి చెంది ఆరుగురికి తీవ్ర గాయాలైన సంఘటన మెదక్ జిల్లా కౌడిపల్లి మండల పరిధిలోని వెంకట్రావు పేట గేటు సమీపాన మెదక్ నర్సాపూర్ ప్రధాన రహదారి రోడ్డుపై ఆదివారం అర్ధరాత్రి తర్వాత చోటుచేసుకుంది వివరాల్లోకెళ్తే హైదరాబాద్ షాపూర్ నగర్ వాస్తవ్యులు పిల్లలతో సహా తొమ్మిది మంది కారులో ప్రయాణిస్తూ మెదక్ వైపు వెళ్తుండగా రైలాపూర్ గ్రామానికి చెందిన హరీష్ రెడ్డి రైలాపూర్ నుండి నర్సాపూర్ వైపు వెళుతుండగా వెంకట్రావు పేట గేటు సమీపన అతివేగంతో రెండు కార్లు ఢీకొన్నాయి ఈ ఘటనలో షాపూర్ నగర్ కు చెందిన మహమ్మద్ అలీ 45 అజీమా బేగం 40 మహమ్మద్ గౌస్ తో పాటు ఏడాది బిడ్డ కూడా మృతి చెందారు. మిగిలిన ఆరుగురు సహనా బేగం. ఇరాన్ షాహిష్. హలీమా, మహమ్మద్ , చిన్నారులు నీలాఫర్ ( ఆరు నెలలు) జూనెర (నాలుగు నెలలు ) తీవ్ర గాయాలు కాగా హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు సంఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి డి.ఎస్.పి వెంకట్ రెడ్డి సిఐ జాన్ రెడ్డి ఎస్సై రంజిత్ రెడ్డి సందర్శించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
