ఆయన కుటుంబంలోని 10 మంది హతం
నలుగురు ముఖ్య అనుచరులు కూడా మరణం
దాడి సమయంలో భవనం లేని మసూద్
ఈ దాడికి ప్రతీకారం తీర్చుకుంటానంటూ శపథం
మోదీని, భారత్ ను సర్వనాశనం చేస్తానంటూ బహిరంగ లేఖ ..
న్యూ ఢిల్లీ – పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం జరిపిన ఆపరేషన్ సింధూర్ దాడిలో జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజహర్ బహావల్ పూర్ తృటి తప్పించుకున్నాడు.. అయితే జైషే మహమ్మద్ స్థావరం నామరేపల్లేకుండా పోయింది. వైమానిక దాడి తర్వాత, ముజఫరాబాద్లోని హఫీజ్ లష్కర్ ఉగ్రవాద స్థావరంలో భయాందోళనలు నెలకున్నాయి. అక్కడి నుంచి మృతదేహాలను వెలికి తీస్తున్నారు. ఉగ్రవాదంపై భారతదేశం జరిపిన సైనిక చర్యలో పాకిస్తాన్ ఉగ్రవాది మసూద్ అజార్ కుటుంబం నాశనమైంది. భారత వైమానిక దాడిలో, జైషే మహ్మద్ ఉగ్రవాది అజార్ కుటుంబానికి చెందిన 10 మంది సభ్యులు మరణించగా, నలుగురు అనుచరులు కూడా మరణించారు. మృతుల్లో జైషే చీఫ్ మసూద్ అజహర్ సోదరి, బావ, మేనల్లుడు ఉన్నారు. దాడి జరిగిన సమయంలో మసూద్ వేరే ప్రాంతంలో ఉండటంతో బతికిబయటపడ్డాడు..
ఈ దాడి జరిగిన తర్వాత జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజహర్ ఓ లేఖను విడుదల చేశారు. ఇక, భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై విషం కక్కుతూ లేఖను మసూద్ విడుదల చేశారు. ప్రధాని మోడీ అన్ని రకాల యుద్ధ నియామాలు ఉల్లంఘించారు అని తీవ్రంగా మండిపడ్డారు. నాకు భయం లేదు, నిరాశ లేదు, విచారం లేదంటూ ఆ లేఖలో పేర్కొన్నాడు. అయితే, ప్రధాని మోడీని, భారతదేశాన్ని నాశనం చేస్తానంటూ హెచ్చరించారు. భారత్ పై త్వరలోనే ప్రతీకారం తీర్చుకోవడానికి ప్లాన్ చేస్తానంటూ మసూద్ అజహర్ లేఖలో ప్రస్తావించారు.