Market | ధరల ఊగిసలాట

Market | ధరల ఊగిసలాట
- కర్నూలు వ్యవసాయ మార్కెట్లో రేట్లలో మార్పులు
Market | కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : ఈ–జాతీయ వ్యవసాయ మార్కెట్ (ఈనామ్) ఆధ్వర్యంలో కర్నూలు వ్యవసాయ మార్కెట్ కమిటీలో గురువారం నిర్వహించిన వేలంలో ప్రధాన పంటల ధరలు గణనీయంగా మార్పులు చూపాయి. కొన్ని పంటలకు ఆశాజనక ధరలు లభించగా, మరికొన్నింటికి ఆశించిన స్థాయిలో ధరలు రాక రైతుల్లో ఆందోళన నెలకొంది.
మిర్చి మార్కెట్లో ఊపు…
ఈ రోజు మార్కెట్లో మిర్చి రకాలే ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. తేజా మిర్చి క్వింటాల్కు గరిష్టంగా రూ.14,709, సగటు ధర రూ.14,109 పలికింది. తాలు మిర్చి గరిష్టంగా రూ.11,801 చేరింది. దేవనూరు డీలక్స్ మిర్చికి అత్యధికంగా రూ.16,309 ధర లభించగా, సూపర్–10 మిర్చి కూడా గరిష్టంగా రూ.14,581 వరకు విక్రయమైంది. మిర్చి దిగుబడులు తగ్గడం, నిల్వలు పరిమితంగా ఉండటంతో ధరలు బలపడినట్టు వ్యాపారులు చెబుతున్నారు.

కందుల ధరలు ఆశాజనకం
కందులు గరిష్ట ధర రూ.7,200, సగటు ధర రూ.6,970గా నమోదైంది. వడకల కందులు గరిష్టంగా రూ.5,284 ధర పలికాయి.దక్షిణాది మార్కెట్లలో డిమాండ్ పెరగడంతో కందులకు మంచి మద్దతు లభించినట్లు తెలుస్తోంది. వేరుశనగ, ఆముదం ధరలు స్థిరంగా వేరు శనగలు గరిష్టంగా రూ.8,016, ఆముదాలు గరిష్టంగా రూ.6,089 ఈ పంటలకు మధ్యస్థ స్థాయి లావాదేవీలు జరిగాయి.
ధాన్యాల్లో మిశ్రమ స్పందన
మొక్కజొన్న – గరిష్ట ధర రూ.1,852
వరి ధాన్యం – లావాదేవీలు మందగించాయి
మినుములు – గరిష్టంగా రూ.7,169.. సజ్జలు – గరిష్ట ధర రూ.2,811
సోయా బీన్ – డిమాండ్ తగ్గడంతో ధరలు ఆశించిన స్థాయికి చేరలేదు.
ఉల్లి ధరలకు ఊరట
ఉల్లి గడ్డలు గరిష్టంగా రూ.2,026, సగటు ధర రూ.1,465గా నమోదయ్యాయి. అయితే రవాణా ఖర్చులు పెరగడంతో రైతులకు పూర్తి లాభం అందలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
మొత్తం విశ్లేషణ ఇలా..
కర్నూలు మార్కెట్లో మిర్చి, కందులు రైతులకు లాభదాయకంగా కావడం విశేషం. పప్పుధాన్యాలు మితమైన స్పందన కనిపించింది. ధాన్య పంటల్లో ఆశించిన ఉత్సాహం లేని పరిస్థితి. ప్రభుత్వం మద్దతు ధరలపై స్పష్టత ఇవ్వకపోవడం, మధ్యవర్తుల ఆధిపత్యం కొనసాగడం వల్ల రైతులు ఇంకా పూర్తి లాభాలు పొందలేకపోతున్నారని రైతు సంఘాలు విమర్శిస్తున్నాయి. రాబోయే రోజుల్లో కొనుగోళ్ల వేగం పెరిగితే ధరలు మరింత మెరుగయ్యే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
