Manuguru Top Story | కారును ముంచిన కర్కశుడు

ఆంధ్రప్రభ బ్యూరో, భద్రాద్రి కొత్తగూడెం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పార్టీ కండువాలను, పైటకొంగులు తీయడానికి ఉపయోగించే నరరూప రాక్షసుడి ఆకృత్యాలు రోజురోజుకు వెలుగు చూస్తున్నాయి. సదరు నే(మే)తను సొంత పార్టీకి చెందిన నేతలే చీదరించుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆయనపై పలు లైంగిక ఆరోపణలు, భూదందాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో పని చేసిన ఓ మహిళా ప్రజా ప్రతినిధితో సదరు నాయకుడు రాసలీలలు సాగించిన వీడియోల గురించి ప్రస్తుతం మణుగూరులో జోరుగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో సంబంధిత వీడియోలను సంపాదించాలని అధికార, విపక్ష పార్టీలకు చెందిన నేతలు ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నట్లు తెలుస్తోంది.

అబద్ధాలతో విధ్వంస రచన

మణుగూరు మాజీ జడ్పీటీసీగా పనిచేసిన సదరు కీచక నేత, జడ్పీటీసీ ఎన్నికల కోసం అప్పులు చేశానంటూ తనకు ఆశ్రయమిచ్చిన అందరిని ప్రాదేయపడినట్లు తెలుస్తోంది. తాను ఎన్నికల్లో గెలిచేందుకు అప్పులు భారీగా చేయాల్సి వచ్చిందని, సొంత సామాజికవర్గానికే చెందిన ఓ సీనియర్‌ నేతను స్థానిక సంస్థ ల ఎమ్మెల్సీ ఎన్నికల శిబిరంలో ఉండగా కోరినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. ఆ సమయంలో శిబిరంలో ఉన్న సదరు నాయకుడు ఇబ్బంది పడుతున్నాడని జాలి చూపి, ఆయనకో అవకాశం కల్పించి ప్రత్యర్థి పార్టీకి చెందిన అభ్యర్థితో రాయభేరం నడిపి, మాట్లాడుకోవాలని సూచించారు. ఆదుకోవాలని కోరిన సదరు మాజీ జడ్పీటీసీ, ఆ సీనియర్‌ నేత చూపిన మార్గంలో కాసుల కోసం ప్రయత్నాలు చేసి, అదే విషయాన్ని తనకు అనుకూలంగా మార్చుకొన్నాడు.

ఆయన సత్యహరిశ్చంద్రుడైనట్లు తనకు అవకాశం కల్పించిన విషయాన్ని, ఫోన్‌ ద్వారా తెలియజేసి, ఈ మొత్తం వ్యవహారాన్ని రికార్డ్‌ చేసి, అప్పటి పార్టీ అభ్యర్థి నుంచి పెద్దమొత్తంలో తీసుకొని, తనను పార్టీ విధానాలకు వ్యతిరేకంగా పని చేసేలా ఓ సీనియర్‌ నేత ఒత్తిడి చేస్తున్నారంటూ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో అధిష్టానం సైతం సదరు నాయకుడితో పాటు, ఆయన అభిమానించే నేతను సైతం ఒంటరి చేసినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో పార్టీ అధినేత సైతం జిల్లాకు చెందిన ఓ ముఖ్యనేతను కనీసం కలిసేందుకు, ఆయన కుటుంబ వేడుకకు సంబంధించిన ఆహ్వాన పత్రికను తీసుకునేందుకు కూడా అవకాశం కల్పించక పోగా, అడుగడుగునా అవమానాలకు గురిచేసినట్లు, దీంతో మనసు విరిగిన ఆయన పార్టీని వీడినట్లు ప్రచారం జరిగింది.

ఇదంతా చర్చ సాగుతున్న క్రమంలోనే, పార్టీ అభ్యున్నతికి ఎంతగానో కృషి చేసిన ఆ నేత, హస్తం పార్టీలో చేరి పదికి పది స్థానాల్లో అభ్యర్థులను గెలిపించిన విషయం పాఠకులకు సైతం విధితమే. అలా పార్టీ మారిన నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాగా, ఆయన చొరవతోనే రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు జరిగి, సంచలన ప్రజాతీర్పు వెలువడింది. దీంతో కాంగ్రెస్‌ పార్టీ అధికారం చేపట్ట గా, అప్పటి అధికార పార్టీ ప్రతిపక్షానికి పరిమితమైంది.

కర్కశుడని తెలిసినా ఎందుకంత ప్రేమ.?

పార్టీని చిన్నాభిన్నం చేయడంతో పాటు, పార్టీ పట్ల అభిమానంతో రాజకీయాల్లోకి వచ్చే మహిళలను లోబర్చుకుంటున్న పాపాల బైరవుడిపై పార్టీ బాధ్యులు ఎందుకంత ప్రేమను చూపుతున్నారన్న ప్రశ్నకు సమాధానం లభించక పార్టీని నమ్ముకున్న వాళ్లే కలవరపడుతున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని, ఆయన సాగించిన రాసలీలల వ్యవహారం బయటకు పొక్కుతున్నా, ఎందుకు కనీసం ప్రశ్నించడం లేదని వారు పార్టీ ముఖ్యులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీలు మారడం, పార్టీ కండువాలు మార్చడంతో పాటు, ఆయనకు పైట కొంగులు తీయడం తెలుసంటూ వారు ఎద్దేవా చేస్తున్నారు. గతంలో పని చేసిన పార్టీలోనూ ఇవే ఆరోపణలు వెల్లువెత్తాయని, అంతేకాకుండా ఆ పార్టీలో తన హయాంలో సాగించిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన విషయాలపై ఇప్పటికీ స్పష్ట తనివ్వలేదని సదరు నేతపై విమర్శలు గుప్పించడం అందరికీ తెలిసిందే. ఓ వైపు భూదందాలు, సెటిల్‌మెంట్లు, మరోవైపు మహిళా నాయకురాళ్లపై లైంగిక దాడులు, పార్టీని విచ్ఛిన్నం చేసే కుట్రలు ఇలా ఆయన తీరును సొంత పార్టీకి చెందిన నేతలే ఎండగడుతున్న పరిస్థి తులు నెలకొన్నాయి. అయినప్పటికీ భద్రాద్రి జిల్లా పార్టీ ముఖ్యులు, ఆయనను వెం ట పెట్టుకొని ముందుకు సాగడం, ఇటీవల నిర్వహించిన ఆ పార్టీ సభకు సైతం తీసుకొని వెళ్లడం విమర్శలకు తావిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *