Maktal | గడ్డంపల్లిని ఆదర్శ గ్రామంగా అభివృద్ధి చేస్తా

Maktal | గడ్డంపల్లిని ఆదర్శ గ్రామంగా అభివృద్ధి చేస్తా

అవ‌కాశ‌మివ్వండి…
గడ్డంపల్లి సర్పంచ్ అభ్యర్థి సవరమ్మ రామాంజనేయులు

Maktal | మక్తల్, ఆంధ్రప్రభ : అభివృద్ధిలో మండలంలోనే గడ్డంపల్లి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని, ఈ ఎన్నికల్లో తనను ఆశీర్వదించి తనకు సర్పంచిగా అవకాశం కల్పించాలని గడ్డంపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి గా కాంగ్రెస్ పార్టీ మద్దతుతో బరిలో నిలిచిన సవరమ్మ రామాంజనేయులు గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు. గ్రామపంచాయతీ ఎన్నికల్లో తనను సర్పంచ్ గా గెలిపిస్తే గడ్డంపల్లి గ్రామాన్ని మంత్రి వాకిటి శ్రీహరి సహకారంతో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తానన్నారు. సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ మద్దతుతో పోటీ చేస్తున్న ఎం.సవరమ్మ రామాంజనేయులు శనివారం మాజీ సర్పంచ్ బి.త్రివేణి జ్ఞానేశ్వర్ తో కలిసి గ్రామంలో ముమ్మరంగా ఇంటింటి ప్రచారం చేపట్టారు.

ప్రతి గడపగడపకు వెళ్లి ఓటర్లను కలుసుకొని గ్రామ అభివృద్ధి కోసం ఎన్నికల్లో తనకు సర్పంచిగా అవకాశం కల్పించవలసిందిగా విన్నవించారు. తనను సర్పంచ్ గా గెలిపిస్తే చేపట్టబోయే అభివృద్ధి పనులను ఓటర్లకు వివరించి మద్దతును కోరారు. గత ప్రభుత్వాలు పునారవాస గ్రామమైన గడ్డంపల్లి నిర్లక్ష్యం చేయడం వల్ల రోడ్డు సౌకర్యం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నోసార్లు పాలకులకు విన్నవించిన సమస్య పరిష్కారం లేదన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి రాజకీయాలకు అతీతంగా అందజేయడమే తన లక్ష్యమన్నారు.

గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఇతరుల మాయమాటలకు మోసపోకుండా నిస్వార్ధంగా సేవ చేసేందుకు ముందుకు వచ్చిన తనకు అండగా నిలవాల్సిందిగా ఆమె ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. గ్రామంలో నెలకొన్న సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తానని తనకు మద్దతునిచ్చి సర్పంచ్ గా గెలిపించవలసిందిగా ఎం.సవరమ్మ రామాంజనేయులు గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సుభద్రమ్మ, రామాంజనేయులు, సుభద్ర, సవారన్న, గుండప్ప, ఎద్దుల సువన్న, సి.నగేష్, అయ్యప్ప, చక్రవర్తి ఎరుకల, నారాయణ, రాయుడు, ఖమ్మం పాటి లక్ష్మన్న, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply