Mahakumbamela | త్రివేణి సంగంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మాజీ ఎమ్మెల్యే కూన పుణ్య స్నానాలు
హైదరాబాద్ – ప్రయాగ రాజ్ మహా కుంభమేళాలో తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ , కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ త్రివేణి సంగమంలో నేడు పుణ్యస్నానం ఆచరించారు. అనంతరం వారు గంగమ్మకు ప్రత్యేక పూజలు , అర్చనలు చేయించారు. ఆ తర్వాత సమీపంలోని ఆలయాలను సందర్శించారు.. ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ప్రజల సంక్షేమం కోసం పాటుపడేందుకు మరింత శక్తిని ప్రసాదించాలని ఆ దేవుడిని కోరుకున్నారు.