లక్నో : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లో మ్యాచ్లు ఉత్కంఠభరితంగా జరుగుతున్నాయి. ప్రతి జట్టు గెలుపే లక్ష్యంగా రణరంగంలోకి దూకుతుంది. దీంతో చివరి ఓవర్ల వరకు మ్యాచ్లు ఉత్కంఠభరితంగా మారుతున్నాయి. కాగా, ఈరోజు మరో హెడ్ టు హెడ్ మ్యాచ్ కు రంగం సిద్ధమైంది.
విజయ ఉత్సాహంలో ఉన్న రిషబ్ పంత్ సారథ్యంలోని లక్నో సూపర్ జెయింట్స్ – శ్రేయాస్ అయ్యర్ నాయకత్వంలోని పంజాబ్ కింగ్స్ మధ్య పోరుకు అంతా సిద్ధమైంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో లక్నో జట్టు తొలతు బ్యాటింగ్ చేపట్టనుంది.
కాగా, ఐపీఎల్ టోర్నీల్లో LSG – పంజాబ్ ఇరు జట్లు ముఖాముఖి పోరులో 4 మ్యాచ్ల్లో తలపడ్డాయి. ఈ 4 మ్యాచ్ల్లో LSG జట్టు 3 మ్యాచ్ల్లో విజయం సాధించగా పంజాబ్ జట్టు 1 సార్లు గెలిచింది.
తుది జట్లు
పంజాబ్ కింగ్స్ : శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), ప్రభ్సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), ప్రియాంష్ ఆర్య, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, సూర్యాంశ్ షెడ్జ్, గ్లెన్ మాక్స్వెల్, మార్కో జాన్సెన్, యుజ్వేంద్ర చాహల్, లాకీ ఫెర్గూసన్, అర్ష్దీప్ సింగ్
లక్నో సూపర్ జెయింట్స్: మిచెల్ మార్ష్, ఐడెన్ మార్క్రామ్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్/కెప్టెన్), ఆయుష్ బదోని, దిగ్వేష్ సింగ్ రాఠీ, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, అవేష్ ఖాన్, శార్దూల్ ఠాకూర్, రవి బిష్ణోయ్