కర్నూల్ బ్యూరో, ఆంధ్రప్రభ – కర్నూలు జిజిహెచ్ లో రెండు అరుదైన శస్త్రచికిత్సలు విజయవంతం చేశారు వైద్యులు. ఈ సందర్భంగా సోమవారం జి జి హెచ్ లు ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో ఆసుపత్రి సూపరింటెండెంట్, డా.కె.వెంకటేశ్వర్లు, మాట్లాడుతూ కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని సర్జరీ విభాగంలో ఆత్మకూరు నియోజకవర్గం పాములపాడు చెందిన 15 ఏళ్ల ఎలిషా రాణి వాంతుల్లో రక్తస్రావం వంటి లక్షణాలతో ఆసుపత్రికి వచ్చారు. ఆమెకు పరీక్ష నిర్వహించగా అన్నవాహిక వేరిసెస్తో కూడిన పోర్టల్ హైపర్టెన్షన్గా నిర్ధారణ అయ్యింది. హెమోగ్లోబిన్ 6 గ్రాములు, ప్లేట్లెట్ కౌంట్ 60,000గా ఉండడంతో ఎండోస్కోపిక్ బ్యాండ్ లిగేషన్ చేశారు. అనంతరం శస్త్రచికిత్సా పరిశీలనలో స్ప్లీనోరీనల్ షంట్ శస్త్రచికిత్స నిర్వహించారు. శస్త్రచికిత్స అనంతరం ప్లేట్లెట్ కౌంట్ 5 లక్షలకు పెరిగింది. శస్త్రచికిత్సానంతరకాలం అనుకూలంగా సాగింది ,లక్షణాలు పూర్తిగా తగ్గిపోయాయి అని ఆసుపత్రి సూపర్డెంట్ వెల్లడించారు.
ఇంకా అనంతపురం జిల్లా, బాల వెంకటాపురం గ్రామానికి చెందిన మరొక పేషెంట్ 29 ఏళ్ల రోగిని గర్భాశయ రక్తస్రావంతో ఆసుపత్రికి వచ్చారు, ఇది పోర్టల్ హైపర్టెన్షన్కు అరుదైన ప్రదర్శన. ఎండోస్కోపీలో ఈమెకు కూడా అన్నవాహిక వేరిసెస్ గుర్తించి బ్యాండ్ లిగేషన్ అనంతరం శస్త్రచికిత్సా పరిశీలనలో పెద్ద పరిమాణంలో కొల్లాటెరల్స్ ,పోర్టల్ క్యావెర్నోమా గుర్తించబడినట్లు తెలిపారు. స్ప్లీనెక్టమీ నుంచి నిర్వహించబడగా, స్ప్లీన్ బరువు 1.5 కిలోలుగా నమోదు అయ్యింది. ప్రాథమికంగా 50,000గా ఉన్న ప్లేట్లెట్ కౌంట్ ఆపరేషన్ అనంతరం 4 లక్షలకు పెరిగింది. శస్త్రచికిత్సానంతర కాలం ప్రశాంతంగా సాగింది
ఈ శస్త్రచికిత్సలను డాక్టర్ రామకృష్ణ నాయిక్ నిర్వహించారు వీరికి తోడుగా ప్రొఫెసర్ డాక్టర్ జయరాం, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సబీరా , అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మన్సూర్ బాషా, డాక్టర్ ప్రణీత్, పీజీలు కూడా శస్త్రచికిత్స బృందంలో భాగమయ్యారు అనస్తీషియా విభాగాన్ని ప్రొఫెసర్ డాక్టర్ సుధీర్ నేతృత్వం వహించగా, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ మురళి ప్రభాకర్ , అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ రఘు ప్రవీణ్, డాక్టర్ సంద్ధ్యా కీలక పాత్ర పోషించారు. వీరందరికీ సర్జరీ విభాగం అధిపతి డాక్టర్ పి. హరిచరణ్, ఆసుపత్రి సూపరిండెంట్ శస్త్రచికిత్స బృందాన్ని అభినందించినట్లు తెలిపారు.